గణతంత్ర వేడుకల్లో విషాదం: ఆ గ్రామంలో తొలిసారి జాతీయ జెండా ఎగిరింది
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం గంభీపూర్లో గణతంత్ర వేడుకల్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గంభీపూర్లోని పాఠశాలలో స్కూలు హెడ్ మాస్టర్ భద్రం జెండా ఎగురవేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు.
పోలీసుల కథనం ప్రకారం రిపబ్లిక్ డే ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వాతంత్ర్య ఉద్యమ నేతల చిత్రపటాలకు కొబ్బరికాయ కొట్టి జెండాను ఆవిష్కరించబోతున్న క్రమంలో గుండెపోటు రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు.
దీంతో ఆయన్ని ఆటోలో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.

ఆ గ్రామంలో జాతీయ జెండా తొలిసారి ఎగిరవేశారు
గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా టాక్లి గ్రామంలో తొలిసారిగా జాతీయ జెండా ఎగిరింది. 67వ గణతంత్ర దినోత్సవం రోజున ఆ గ్రామంలో జాతీయ జెండాను ఎగురవేశారు. బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేని ఈ గ్రామం దుస్థితిపై ఒక టీవీ ఛానల్ కథనం మేరకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది.
దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ గ్రామానికి ఇప్పటి వరకు ప్రభుత్వం పథకాలేవీ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications