ఆ బ్రిడ్జి వద్ద డబ్బుల మూటలు....ట్రాపిక్ జాంతో కిలోమీటర్ల మేర వాహనాల నిలిపివేత
హైదరాబాద్ :పెద్ద నగదు నోట్ల రద్దు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. పెద్ద నగదు నోట్ల రద్దుతో బ్లాక్ మనీ ఉన్న వారు పెద్ద ఎత్తున నగదును బయట పారేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబంగా రాష్ట్రాల్లో చోటుచేసుకొంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని అత్తాపూర్ బ్రిడ్జి వద్ద కూడ నగదు నోట్లు పారేశారని ప్రచారం రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పెద్ద నగదునోట్ల రద్దు కారణంగా నల్లదనం కలిగి ఉన్నవారు రద్దు చేసిన నగదును బయట పారేస్తున్నారు.అయితే హైదరాబాద్ లోని అత్తాపూర్ లోని బ్రిడ్జి వద్ద రద్దు చేసిన పెద్ద నగదు నోట్లను పారేశారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో పెద్ద ఎత్తున అత్తాపూర్ బ్రిడ్జివద్దకు చేరుకొన్నారు. నగదు కోసం వెతికారు.
అత్తాపూర్ బ్రిడ్జి సమీపంలో నగదు కోసం స్థానికులు వెతకడం ప్రారంభించడంతో... ఆ దారి వెంట వెళ్ళే వాహానదారులు ...తమ ప్రయాణాలను మానుకొని నగదును వెతికారు. దీంతో ఆ ప్రాంతంలో గుంపులు గుంపులుగా జనం కరెన్సీ కోసం వెతకడం ప్రారంభించారు.
కరెన్సీ పారేశారనే ప్రచారం వ్యాప్తి చెందడంతో అత్తాపూర్ ఫ్లై ఓవర్ పై ట్రాపిక్ జాం అయింది.నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో కూడ పెద్ద నగదు నోట్లు రద్దు చేసినట్టు ప్రచారం జరిగింది. అత్తాపూర్ వద్ద ట్రాపిక్ జాం కారణంగా పోలీసులను ట్రాపిక్ ను క్లియరెన్స్ చేసేందుకు కష్టపడాల్సి వస్తోంది.