స్టీఫెన్ని ఆశీర్వదించేందుకే వెళ్లా, బాబు గ్రేట్: జగన్పై 'ఓటుకు నోటు' సెబాస్టియన్ ఫైర్
విజయవాడ: నాలుగు నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎలాంటి తప్పు చేయలేదని కేసులో నిందితుడు సెబాస్టియన్ మంగళవారం నాడు చెప్పారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఆహ్వానం మేరకు ఆయనను ఆశీర్వదించడానికి వెళ్లానన్నారు.
విజయవాడ కోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ వ్యవహారంలో అంతకంటే ఎక్కువగా చెప్పేది ఉండదన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన సెబాస్టియన్ తనను కల్సిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొంతు ఎంతో మధురంగా ఉంటుందని, దీనికితోడు మనస్తత్వం కూడా మంచిదని, ప్రధానంగా గుంటూరులో క్రైస్తవ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే గాక క్రైస్తవుల ప్రార్థనలకు ఇజ్రాయెల్ వెళ్లేందుకు ప్రత్యేక సర్వీస్లు నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు.

అందుకే క్రైస్తవులందరూ చంద్రబాబును ఎంతగానో అభిమానిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో కూడా క్రైస్తవులలో అత్యధిక మంది టిడిపిని బలపరచారన్నారు. ప్రతిపక్ష నేత జగన్ క్రైస్తవుడై ఉండి మత విశ్వాసాలకు భిన్నంగా శిలువతో గోదావరి పుష్కర స్నానమాచరించి పిండ ప్రదానం చేయటం విచారకరమన్నారు.
జగన్ వెన్నంటి నిలిచిన క్రైస్తవులు అన్ని విధాలా మోసపోతున్నారన్నారు. చంద్రబాబు మరో మూడుసార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలరన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణ సుభిక్షంగా ఉండేది : శ్రీనివాస్ గౌడ్
ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులతో తెలంగాణ సుభిక్షంగా ఉండేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో చెరువులను కబ్జా చేసి నాశనం చేశారన్నారు.
చెరువుల మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. తెలంగాణలో చెరువులు మాయమై వలసలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు చెరువులను నిర్లక్ష్యం చేశారన్నారు. టెండర్లు పిలిచి దోచుకుపోయారే తప్ప చెరువులను నింపాలని ఆలోచన చేయలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చెరువులను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications