నాగర్కర్నూల్ జిల్లాలో హాస్టల్ సిబ్బంది నిర్వాకం.. అన్నదానం వద్దకు వెళ్లి తినాలని హుకుం
అది ఒక ఎస్టీ బాలుర వసతి గృహం. సాధారణంగా హాస్టల్స్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఘన కార్యానికి ఒడిగట్టారు హాస్టల్ సిబ్బంది. దాదాపు 380 మంది విద్యార్దులు ఉన్న ఆ హాస్టల్ లో శివరాత్రి సందర్భంగా 180 మంది తమ స్వగ్రామాలకు వెళ్ళగా.. 200 మంది మాత్రమే హాస్టల్ లో ఉన్నారు. అయితే ఆ 200 మందికి అన్నం వండకుండా శివరాత్రి సందర్భంగా గుడి దగ్గరకు వెళ్లి అన్నదానం వద్ద తినాలని సూచించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగులలో చోటు చేసుకుంది.
హాస్టల్ లో ఉన్న 200 మంది విద్యార్దులకు బుధవారం నాడు ఉదయం అల్పాహారంగా అన్నం, చారు వడ్డించారు. అంతా వరకు బాగానే ఉన్న మధ్యాహ్నం, రాత్రి భోజనం కోసం దేవాలయం వద్దకు వెళ్లి అన్నదానం వద్ద తినాలని హుకుం జారీ చేశారు. హాస్టల్ కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిబండ శివాలయంలో మధ్యాహ్నం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి వెళ్లాలని.. రాత్రికి వీరంరాజుపల్లి రోడ్డులోని గంగమ్మ దేవాలయం వద్ద పెట్టే భోజనం తినాలని విద్యార్థులకు చెప్పి వంట చేయడం మానేశారు.

అయితే విధిలేక ఆలయాల వద్దకు వెళ్లిన విద్యార్థులకు చేదు అనుభవమే ఎదురైంది. భక్తులు తిన్నాకే తినాలని ఆలయ నిర్వాహకులు చెప్పడంతో విద్యార్ధులకు షాక్ తగిలింది. భక్తులు తినే వరకు ఆగి కొందరు పెట్టింది తినగా... సగం మందికి పైగా విద్యార్థులు తినకుండా మిగిలిపోయినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం పాఠశాలలో విద్యార్థులు నీరసంగా కనిపించడంతో ఉపాధ్యాయులు ఆరా తీయడంతో విషయం బయటపడింది.
200 మంది విద్యార్ధులు హాస్టల్ లో ఉన్నప్పుడు భోజనం వండకుండా.. అన్నదానం వద్ద తినమని పంపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భోజనం కోసం కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి విద్యార్థులను నడుచుకుంటూ వెళ్లాలని చెప్పడమేంటని ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications