తెలంగాణ హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఏం జరిగింది అంటే ?
పుట్టిన ప్రతి జీవికీ తప్పనిది అంటే మరణం అనే చెప్పాలి. చావు అనేది ఎవరికి ఎప్పుడూ ఎలా వస్తుందో చెప్పలేం. ఆ సమయం వచ్చింది అంటే దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఇప్పటికీ ఊహించని రీతిలో పలువురు మృత్యువాత పడ్డ ఘటనను చూస్తుంటాం. ఇప్పుడు ఈ తరహా ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఉన్న హైకోర్టులో చోటు చేసుకుంది. కోర్టు హాలులో వాదనలు వినిపిస్తూనే న్యాయవాది కుప్పకూలిన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. న్యాయవాది వేణుగోపాలరావు 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే తోటి న్యాయవాదులు ఆయనను అంబులెన్స్లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వేణుగోపాలరావు గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే న్యాయవాది మృతికి సంతాపంగా 21వ కోర్టులో పిటిషన్ల విచారణను న్యాయమూర్తి నిలిపివేశారు. మిగతా కోర్టుల్లోనూ అత్యవసర పిటిషన్లు, పాస్ ఓవర్ పిటిషన్లను విచారించి.. రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.













Click it and Unblock the Notifications