బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ.. కోట్ల వేతనాలు ఎగవేత!
బంజారాహిల్స్ : దాదాపు కోటి రూపాయలకు పైగా వేతనాలను ఎగ్గొట్టి.. ఓ సాఫ్ట్ వేర్ సంస్థ బిచాణా ఎత్తేసింది. నెలన్నర రోజులుగా వేతనాల కోసం ఆశగా ఎదురుచూస్తూ వస్తోన్న ఉద్యోగులకు ఏదో ఒకటి చెప్పి.. సాగదీస్తూ వచ్చిన కంపెనీ గురువారం నాడు బోర్డు తిప్పేసింది. దీంతో చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు ఉద్యోగులు.
వివరాల్లోకి వెళ్తే.. బంజరాహిల్స్ రోడ్డు నం.2లో ఉన్న వ్యాంకో గ్లోబల్ టెక్ లిమిటెడ్ అనే కంపెనీలో దాదాపు 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నెలన్నర రోజులుగా ఉద్యోగులెవరకీ వేతనాలు ఇవ్వలేదు కంపెనీ యాజమాన్యం. సుమారుగా రూ.1.25 కోట్లను యాజమాన్యం ఉద్యోగులకు బకాయిపడింది. వేతనాల గురించి ఎప్పుడూ ఆరా తీసిన నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తూ వచ్చారు సీఈవో శ్రీకాంత్ కిరణ్ చెరు, సృజన గొట్టిముక్కల.

ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం ఉద్యోగులంతా ఆందోళన చేసి.. యాజమాన్యాన్ని గట్టిగా నిలదీయడంతో గురువారం నాడు వేతనాలు చెల్లించడానికి అంగీకరించారు. ఇదే క్రమంలో గురువారం నాడు ఆఫీస్ కు వెళ్లిన ఉద్యోగులందరు సంస్థ కార్యాలయానికి తాళాలు వేసి ఉండడంతో షాక్ తిన్నారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించి విషయంపై ఫిర్యాదు చేశారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications