బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ.. కోట్ల వేతనాలు ఎగవేత!
బంజారాహిల్స్ : దాదాపు కోటి రూపాయలకు పైగా వేతనాలను ఎగ్గొట్టి.. ఓ సాఫ్ట్ వేర్ సంస్థ బిచాణా ఎత్తేసింది. నెలన్నర రోజులుగా వేతనాల కోసం ఆశగా ఎదురుచూస్తూ వస్తోన్న ఉద్యోగులకు ఏదో ఒకటి చెప్పి.. సాగదీస్తూ వచ్చిన కంపెనీ గురువారం నాడు బోర్డు తిప్పేసింది. దీంతో చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు ఉద్యోగులు.
వివరాల్లోకి వెళ్తే.. బంజరాహిల్స్ రోడ్డు నం.2లో ఉన్న వ్యాంకో గ్లోబల్ టెక్ లిమిటెడ్ అనే కంపెనీలో దాదాపు 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నెలన్నర రోజులుగా ఉద్యోగులెవరకీ వేతనాలు ఇవ్వలేదు కంపెనీ యాజమాన్యం. సుమారుగా రూ.1.25 కోట్లను యాజమాన్యం ఉద్యోగులకు బకాయిపడింది. వేతనాల గురించి ఎప్పుడూ ఆరా తీసిన నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తూ వచ్చారు సీఈవో శ్రీకాంత్ కిరణ్ చెరు, సృజన గొట్టిముక్కల.

ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం ఉద్యోగులంతా ఆందోళన చేసి.. యాజమాన్యాన్ని గట్టిగా నిలదీయడంతో గురువారం నాడు వేతనాలు చెల్లించడానికి అంగీకరించారు. ఇదే క్రమంలో గురువారం నాడు ఆఫీస్ కు వెళ్లిన ఉద్యోగులందరు సంస్థ కార్యాలయానికి తాళాలు వేసి ఉండడంతో షాక్ తిన్నారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించి విషయంపై ఫిర్యాదు చేశారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications