కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి ఆర్థికసాయం.. ప్రభుత్వం కీలక ప్రకటన
నిజామాబాద్ లో గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య(25) కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో విధి నిర్వహణలో గాజుల సౌమ్య గాయపడిన విషయం తెలిసిందే. దాదాపు 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సౌమ్య.. శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు నిమ్స్ వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఆమె మృతిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు పోలీస్ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించింది. ఆమె కుటుంబానికి రూ. కోటి నగదు, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. విధి నిర్వహణలో గాజుల సౌమ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. ఇక ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎక్సైజ్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలను సమకూర్చుతామని ఈ మేరకు జూపల్లి స్పష్టం చేశారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతికి కారణమైన వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సౌమ్య…
— Telangana CMO (@TelanganaCMO) February 1, 2026
ఇక నిజామాబాద్ లో జనవరి 23న ఈ ఘటన జరిగింది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా సౌమ్య ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్రమ రవాణాదారులు ఆమెను వాహనంతో బలంగా ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఇక సౌమ్య మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు సౌమ్య కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications