చనిపోయిందని డాక్టర్లు చెప్పారు, కానీ ఆ చిన్నారి బతికింది, ఎక్కడ?
అప్పుడే పుట్టిన చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అయితే పాపను శ్మశానవాటికకకు తీసుకెళ్లే సమయంలో పాపలో కదలిక కన్పించింది.
వరంగల్: అప్పుడే పుట్టిన చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అయితే పాపను శ్మశానవాటికకకు తీసుకెళ్లే సమయంలో పాపలో కదలిక కన్పించింది. దీంతో పాప బతికే ఉందని గుర్తించిన కుటుంబసభ్యులు ఎంజిఎం ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటన వరంగల్ లో ఆదివారంనాడు చోటుచేసుకొంది.
వరంగల్ జిల్లా పెగడపల్లికి చెందిన శ్రీనివాస్, స్వప్న దంపతులకు ఆదివారం నాడు పాప జన్మించింది. అయితే పుట్టిన శిశువు చనిపోయిందని వైద్యులు ధృవీకరణ పత్రం ఇచ్చారు.

దీంతో స్మశానికి తరలిస్తుండగా పాపలో కదలిక వచ్చింది. దీన్ని గమనించి వారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. వైద్యుల తీరును నిరసిస్తూ ఆందోళనచేశారు.
అనారోగ్యం జన్మించిన చిన్నారికి వైద్యం అందించకుండా చనిపోయిందని సర్టిఫికెట్ ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. వైద్యుల తీరును నిరసిస్తూ ధర్నా చేశారు.












Click it and Unblock the Notifications