Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్ధామ రెడ్డి అరెస్ట్: కార్మిక సంఘాల అత్యవసర సమావేశం: టెన్షన్..టెన్షన్..!

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తంగా మారుతోంది. ప్రభుత్వ సమ్మె వ్యవహారంలో కఠినంగా వ్యవహరిస్తోంది. కార్మిక సంఘాల నేతలు సైతం వెనుకడుగు వేయటం లేదు. తాజాగా సమ్మె మీద ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు..ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్మిక సంఘాలు ఇందిరా పార్క్ వద్ద నిరహార దీక్ష నిర్వహించాలని నిర్ణయించాయి.అక్కడ దీక్షలకు అనుమతి లేదని..ఆంక్షలు కొనసాగుతున్నాయని పోలీసులు ప్రకటించటంతో దీక్షకు కార్మిక సంఘాలు వాయిదా వేసుకున్నాయి.

దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిగా కార్మిక సంఘాల అన్ని రాజకీయ పక్షాల నేతలను కోరారు. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించటంతో కార్మిక సంఘాల నేతలు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద నివాళి అర్పించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ చేసారు. ఇదే సమయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం అవుతోంది. ఇందులో ప్రభుత్వ నిర్ణయం పైన తమ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

SRTC Jac leaders Aswathama reddy and othes arrest by police near gun park

కార్మిక సంఘాల నేతల అరెస్ట్..
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌ పార్క్‌ వద్ద ఉద్రిక్తత నెలకొని ఉంది. ప్రభుత్వ తీరును నిరిసిస్తూ అక్కడ నివాళులర్పించేందుకు ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గన్ పార్క్ వద్దకు తరలి వస్తున్నఆర్టీసీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. గన్‌ పార్క్‌ వద్ద ధర్నా, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం తాము గన్‌ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివారులర్పించడానికి వచ్చామని, దీనికి అరెస్టు చేయడమేమిటని మండిపడుతున్నారు. గన్‌ పార్క్ వద్దకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసారు.

ముందుగా నిర్ణయించిన నిరహార దీక్షను పోలీసులు అనుమతి నిరాకరించటంతో వాయిదా వేసుకున్న కార్మిక సంఘాల నేతలు గన్ పార్క్ కు చేరుకుంటున్నారు. అక్కడకు వచ్చేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డితో పాటుగా రాజిరెడ్డి కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు..కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం..
సీఎం కేసీఆర్‌ హెచ్చరికల నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం కానుంది. ఇప్పటి వరకు సమ్మె జరుగుతున్న తీరుతో పాటుగా విధుల్లో చేరని వారిని ఇక ఉద్యోగులుగా పరిగణంచమంటూ సీఎం కేసీఆర్ చేసిన హెచ్చరికల పైనే ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి హెచ్చరికలు భయపడేది లేదని చెబుతున్న కార్మిక సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిపో అధికారులు తాత్కాలిక నియామకాలు చేపడుతున్నారు.

టీఎస్‌ ఆర్టీసీలో కొత్త నియామకాల నేపథ్యంలో డ్రైవర్‌, కండక్టర్‌ అభ్యర్థులు డిపోల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రభుత్వ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించటం..ఖచ్చితంగా ప్రయివేటు బస్సులను ప్రవేశ పెడతామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించటంతో ఈ సమావేశం ద్వారా ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె విషయంలో ఏరకంగా ముందుకు వెళ్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+