స్ట్రీట్ ఫైట్: పంచ్ల వల్లనే మృతి, వారికి కౌన్సెలింగ్
హైదరాబాద్: హైదరాబాదులో జరిగిన స్ట్రీట్ఫైట్ కేసులో అరెస్టైన 8మంది నిందితుల తల్లిదండ్రులను పోలీసులు మంగళవారం డీజీపీ కార్యాలయానికి పిలిపించారు. నిందితులకు తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహించారు.
నిందితులకు మరోరెండు అనుమానాస్పద మరణాల్లోనూ, అరేబియన్గ్యాంగ్తోనూ సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. స్ట్రీట్ ఫైట్లో నబీల్ అనే యువకుడు మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలావుంటే,
మెడ,
గుండెపై
బలమైన
పంచ్ల
వల్లే
స్ర్టీట్ఫైట్లో
నబీల్
మృతి
చెందినట్టు
పోస్టుమార్టం
నివేదిక
వెల్లడించింది.
నబీల్
పోస్టుమార్టం
నివేదికను
ఉస్మానియా
ఆస్పత్రి
వైద్యులు
పోలీసులకు
అందజేశారు.
నబీల్
శరీరంపై
తొమ్మిది
చోట్ల
బలమైన
పంచ్లు
తగిలినట్టు
వైద్యులు
అందులో
తెలిపారు.
ఈ
కారణంగానే
ఆయన
మృతి
చెందినట్టు
స్పష్టం
చేశారు.