పోలీసుల్ని తప్పించుకొనేందుకు 'ముత్తూట్' దొంగల విహారయాత్రలు
రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ కేసులో నిందితుడైన సుందర్ రాజారత్నం ఆయన సతీమణి రాధతో కలిసి విహరయాత్రలకు వెళ్ళాడు. అయితే పోలీసులు వలపన్ని వారిద్దరిని అరెస్టు చేశారు.
హైదరాబాద్:రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ కేసులో నిందితుడైన సుందర్ రాజారత్నం ఆయన సతీమణి రాధతో కలిసి విహరయాత్రలకు వెళ్ళాడు. అయితే పోలీసులు వలపన్ని వారిద్దరిని అరెస్టు చేశారు. ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారాన్ని దోచుకొన్న తర్వాత పోలీసుల్ని కాపాడుకొనేందుకు సుందర్ ఈ ప్రయత్నం చేశాడు. అయితే చివరకు పోలీసుల వలలో చిక్కుకొన్నాడు.
రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ కేసులో ప్రధాన నిందితుడు లక్ష్మణ్ నారాయణముదంగ్ తో పాటు మరో ఏడుగురిని ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే తాజాగా సుందర్ రాజారత్నం తో పాటు ఆయన భార్యను కూడ సోమవారంనాడు పోలీసులు అరెస్టు చేశారు.

గత ఏడాది డిసెంబర్ 28న, లో రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ లో దుండగులు 41.8 కిలోల బంగారు ఆభరణాలు దోచుకొన్నారు. ఈ ఘటన జరిగిన ఐదురోజుల్లోనే పోలీసులు ఐదుగురిని అరెస్టు చేనశారు. ఆ తర్వాత మరో ముగ్గురిని కూడ రిమాండ్ కు తరలించారు.
తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సుందర్ రాజారత్నం ఆయన సతీమణి రాధను కూడ అరెస్టు చేశారు. ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేయడంతో ముంబాయి నుండి సుందర్ రాజారత్నం దంపతులు ముంబై నుండి పారిపోయారు.
నేపాల్, కోయంబత్తూరు, చెన్నై, ఊటీ, గోవాల్లో గడిపారు. ఈ కేసులో పోలీసులకు దొరకకుండా తప్పించుకొనేందుకుగాను వారు విహరయాత్రలకు వెళ్ళారు. అయితే సుందర్ దంపతులు ధారవి వచ్చారననే సమాచారం తెలుసుకొన్న ముంబాయి, హైద్రాబాద్ పోలీసులు సుందర్ దంపతులను అరెస్టు చేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications