తెలంగాణ మహిళ ఛైర్పర్సన్గా సునీతా లక్ష్మారెడ్డి, ఆరుగురు సభ్యుల నియామకం
హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్ పర్సన్ తోపాటు ఆరుగురు సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది.
మహిళా కమిషన్ సభ్యులుగా కే ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి, షహీనా, గద్దల పద్మ, సుధామ్ లక్ష్మి, కటారి రేవతీరావు నియమితులయ్యారు. ఛైర్ పర్సన్ తోపాటు సభ్యులంతా ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.

గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ హయాంలో సునీతా లక్ష్మారెడ్డి మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆమెను ఈ పదవి వరించడం గమనార్హం.
కాగా, గతంలో సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ నుండి వరసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999, 2004,2009వ సంవత్సరాల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో సునీతా లక్ష్మారెడ్డి మంత్రిగా పనిచేశారు.
అయితే, 2014లో జరిగిన మెదక్ ఉప ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి సునీత లక్ష్మారెడ్డి ఓటమిపాలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
-
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications