కాంగ్రెస్కి బ్రాండ్ అంబాసిడర్ కిషన్ రెడ్డి: జగ్గారెడ్డి సంచలనం
కాంగ్రెస్ పార్టీకి బలాన్నిచ్చే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని సన్మానిస్తానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి. బీఆర్ఎస్కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. అదే జరిగితే సన్మానిస్తామని జగ్గారెడ్డి చెప్పారు.
శుక్రవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ఐనట్టున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఐదేళ్లు సీఎం రేవంత్.. కాంగ్రెస్ ప్రభుత్వం సేఫ్ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలను పడగొట్టే దాంట్లో బీజేపీ నేతలు ప్రొఫెసర్లంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా పడగొట్టే అవకాశం లేదన్నారు.

బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాదని తేలిపోయిందని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. అందుకే రోజుకో భాషా.. రోజుకో వేషం మారుస్తున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి చాలా గొప్పవారు. అటల్ బీహార్ వాజ్ పాయ్ దారిలో నడుస్తున్నట్టు కనిపించింది. మంచి పని చేస్తే.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రశంసించే గుణం వాజ్ పాయ్ది. నిండు పార్లమెంట్లో ఇందిరాగాంధీని దుర్గ మాతతో పోల్చారని చెప్పుకొచ్చారు.
25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారంటే.. ఐదు నెలల కాంగ్రెస్ పాలన బాగుందని అర్థమని జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్.. రాష్ట్రంలో మంచి పాలన ఉందని ప్రశంస తమకు మంచిదేనని వ్యాఖ్యానించారు. అంతేగాక, బీజేపీలో ఉన్న ఐదుగురిలో కూడా కొందరు బయటకు వస్తారని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.
డైరెక్ట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇండైరెక్టుగా బీజేపీ ఎమ్మెల్యేలు వస్తున్నట్టు కిషన్ రెడ్డి చెప్పారన్నారని జగ్గగారెడ్డి తెలిపారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తమకు సంతోషాన్నిచ్చాయన్నారు. ఇక, వరి పంట గురించి కిషన్ రెడ్డికి అవగాహన లేదని.. తెలసుకుని మాట్లాడాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు.. సీఎం రేవంత్ రెడ్డిపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో హత్యా రాజకీయాలు లేవని.. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ప్రోత్సహించదన్నారు. మంత్రి జూపల్లిపై అబాంఢాలు వేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications