హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రా జడ్జిపై టీ లాయర్లు గుడ్లు, కోర్టు వద్ద ధ్వంసం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణకు హైకోర్టును ఏర్పాటు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద తెలంగాణ న్యాయవాదులు శుక్రవారం నాడు ఆందోళనకు దిగారు. కోర్టు లోపలకు ఎవరిని వెళ్లనీయకుండా గేట్లు మూసి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రికత పరిస్థితి కనిపించింది.

జడ్జీలను లోనికి వెళ్లనీయలేదు. తెలంగాణకు వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని వారు నినాదాలు చేశారు. న్యాయమూర్తుల పైకి దాడికి దిగే ప్రయత్నం చేశారు. కోడిగుడ్లతోనే కొట్టారు. ఆంధ్రా జడ్జి పైకి తెలంగాణ లాయర్లు కోడిగుడ్లు విసిరారు. అయితే, న్యాయమూర్తులకు గుడ్లు తగలలేదు. జడ్జిల వాహనాల పైకి కూడా గుడ్లు విసిరే ప్రయత్నం చేశారు. అవి పక్కనున్న వ్యక్తుల పైన పడ్డాయి.

మధ్యాహ్నం కూడా ఘర్షణ జరిగింది. ఓ కేసు విచారణ సాగుతుండగా పలువురు కోర్టు హాలులో అద్దాలు, కుర్చీలు, పూలకుండీలు ధ్వంసం చేశారు. దీనిపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు విచారిస్తున్నారు. అయితే, విధ్వంసానికి పాల్పడింది తాము కాదని, ఎవరో తమ పైన తప్పుడు అభిప్రాయం కలిగించేందుకు ఇదంతా చేశారని న్యాయవాదులు చెబుతున్నారు.

ఇరు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలి: దేవేందర్‌ గౌడ్‌

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు తక్షణం ప్రత్యేక హోదాను అమలు చేయాలని తెలుగుదేశం ఎంపీ దేవేందర్‌ గౌడ్‌ కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో చేసిన హామీలు, నాటి ప్రధాని మన్మోహన్‌ రాజ్యసభలో చేసిన ప్రకటనను పూర్తిగా అమలు చేయాలన్నారు.

టీ లాయర్ల ఆందోళన

టీ లాయర్ల ఆందోళన

హైకోర్టును విభజించాలని డిమాండ్ చేస్తూ రంగా రెడ్డి జిల్లా కోర్టు వద్ద తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.

టీ లాయర్ల ఆందోళన

టీ లాయర్ల ఆందోళన

ఆందోళనకు దిగిన లాయర్లను పోలీసులు ఇలా లాక్కెళ్లారు. కోర్టులోకి వెళ్లకుండా న్యాయవాదులు జడ్జీలను అడ్డుకున్నారు.

టీ లాయర్ల ఆందోళన

టీ లాయర్ల ఆందోళన

హైకోర్టును విభజించాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదులు రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద చేపట్టిన ఆందోళనకు సంబంధించిన ఓ దృశ్యం ఇది

గుడ్లు విసిరారు..

గుడ్లు విసిరారు..

రంగారెడ్డి జిల్లా వద్ద తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ఆందోళన సందర్భంగా కొంత మంది న్యాయమూర్తుల మీదికి గుడ్లు విసిరారు.

ఇలా పోస్టర్లు

ఇలా పోస్టర్లు

అంధ్ర జడ్జి గోబ్యాక్ అంటూ రంగా రెడ్డి జిల్లా కోర్టు వద్ద తెలంగాణ న్యాయవాదులు పోస్టర్లను ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు.

English summary
Telangana State lawyers thrown eggs in Ranga Reddy district court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X