తెలుగు వద్దు, ఇంగ్లీషే: తెలుగు టెక్కీ మృతితో అలర్ట్ చెప్పిన టాటా
హైదరాబాద్: అమెరికాలోని బహిరంగ ప్రదేశాల్లో తెలుగు మాట్లాడవద్దని, ఆంగ్లంలోనే మాట్లాడాలని తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టాటా) ఎన్నారైలకు సూచించింది. తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్యను దృష్టిలో పెట్టుకుని టాటా ఆ హెచ్చరిక చేసింది.
మాతృభాషలో మాట్లాడడాన్ని తామంతా ప్రేమిస్తామని, అయితే, తరుచుగా అదే అపార్థాలకు దారి తీసే అవకాశం ఉందని, బహిరంగ ప్రదేశాల్లో ఇంగ్లీషు మాట్లాడాలని చెప్పింది. ఈ మేరకు సంఘం ఫేస్బుక్లో ఓ ప్రకటనను జారీ చేసింది.

బహిరంగ ప్రదేశాల్లో ఇతరులతో వాదనలకు దిగవద్దని, అటువంటి సందర్భం వస్తే అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పింది. రద్దీ లేని ప్రాంతాల్లో తరుచుగా దాడులు జరిగే అవకాశం ఉదంని, ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దని కూడా చెప్పింది.
కాన్సాస్లోని బార్లో ఆడమ్ ప్యూరింటన్ జరిపిన కాల్పుల్లో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించగా, అతని మిత్రుడు ఆలోక్ రెడ్డి గాయపడ్డాడు. కూచిభొట్ల అంత్యక్రియలు మంగళవారంనాడు హైదరాబాదులో జరిగాయి. దాడిని అడ్డుకోబోయిన ఇయాన్ గ్రిలోట్ కూడా గాయపడ్డాడు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications