TCS: లేఆఫ్స్ వేళ టీసీఎస్ భారీగా వేతనాలు పెంపు - వీరికి వర్తింపు..!!
అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొద్ది రోజుల క్రితమే పెద్ద ఎత్తున ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించి షాకిచ్చిన సంస్థ ఇప్పుడు ఉద్యోగుల కోసం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పెద్ద మొత్తంలో ఇంక్రిమెంట్లు పెంచుతూ ప్రకటన చేసింది. ఇంక్రిమెంట్ లెటర్లను తమ ఉద్యోగులకు తమ ఉద్యోగులకు మెయిల్ చేసింది. ఉద్యోగుల కేటగిరీలు.. పనితీరు ఆధారంగా వేతనాలను పెంచారు.
ఇటీవలే భారీగా లే ఆఫ్స్ ప్రకటించిన టీసీఎస్ సంస్థ ఇప్పుడు ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ప్రకటించింది. ఉద్యోగి పని తీరు, కేటగిరీని బట్టి 4.5 శాతం నుంచి 7 శాతం వరకూ వేతనాలు పెంచారు. ఈ పెంపు సెప్టెంబర్ నెల నుంచే వర్తిస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. తాజాగా టీసీఎస్ ప్రపంచ వ్యాప్తంగా తన మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది కల్లా దాదాపు 12,200 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడనున్నది. వీరిలో ఎక్కువగా మధ్య స్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగులపైనే ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

ఈ ఆందోళనతో కనిపిస్తున్న ఉద్యోగులకు ఊరటనిస్తూ సంస్థ ఇంక్రిమెంట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 80 శాతం ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. జూనియర్, మధ్య స్థాయి (సీ3ఏ గ్రేడ్ వరకు) ఉద్యోగులకు సెప్టెంబర్ 1 నుంచి వేతన పెంపులను అమలు చేయనున్నట్టు ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్లో టీసీఎస్ సీహెచ్ఆర్వో మిలింద్ లక్కడ్ తెలిపారు.
ఈ ఏడాది జూన్ చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా టీసీఎస్లో 613,069 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లే ఆఫ్స్ ప్రకటించిన టీసీఎస్ ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రయోజనం కలిగేలా ఇంక్రిమెంట్లు ప్రకటించటంతో.. ఇతర ఐటీ సంస్థలు తమ ఇంక్రిమెంట్ల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications