ట్విట్టేష్గా మార్చండి: లోకేష్పై సుమన్, రేవంత్ పైనా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేష్ పేరును ట్విట్టేష్గా మార్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ బాల్క సుమన్ మంగళవారం ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్లపాటు ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీలో తెలంగాణ వైతాళికుల విగ్రహాలను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదులోని ట్యంక్బండ్పై ఉన్న ఆంధ్రా వారి విగ్రహాలు తీసివేస్తామంటే చంద్రబాబు స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణకు విద్యుత్ రాకుండా అడ్డుకుంది చంద్రబాబేనని ఆరోపించారు. తెలంగాణ టీడీపీ నేతలు తమ అధినేతను నిలదీయకుండా తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్నారు.
తెలంగాణ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ముందుగా తన రాష్ట్రాన్ని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి వంటి వారు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ.. ఆంధ్రప్రదేశ్ నేతల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.