విద్యార్ధినిపై టీచర్ వెకిలి చేష్టలు: స్కూల్పై స్థానికుల దాడి, బస్సులకు నిప్పు
మెదక్: పిల్లలకు విద్యాబుద్దలు నేర్పాల్సిన గురువే ఓ విద్యార్ధినిపై వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో అతడు పనిచేస్తున్న ప్రైవేట్ స్కూలుకు లక్షల నష్టాన్ని తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే... మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్ పేట గ్రామంలో చోటు చేసుకుంది.
ఆరేళ్ల బాలికపై స్కూలు పీఈటీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి అక్బర్పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. అదే గ్రామానికి చెంది పీఈటీగా విధులను నిర్వహిస్తున్న కుమార్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
రెండు రోజుల క్రితం బాలికను ఓ తరగతి గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలికను సోమవారం స్కూలుకు వెళ్లేందుకు భయపడింది. అంతేకాదు తాను వేరే స్కూల్లో చేరతానని బాలిక చెప్పడంతో అసలేం జరిగిందంటూ తల్లిదండ్రులు బాలికను నిలదీశారు.

దీంతో బాలిక స్కూల్లో ఇబ్బందిగా ఉందంటూ స్కూలుకి వెళ్లనంటూ పీఈటీ కుమార్ తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పింది. అంతేకాదు రెండు రోజులు క్రితం బాలికపై కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సమయంలో బాలిక రోదనలు విన్న తోటి విద్యార్ధులు ప్రిన్సిపాల్ రమేశ్కు తెలియజేశారు.
అయితే దీనిని ప్రిన్సిపాల్ తేలికగా కొట్టిపారేశారు. సోమవారం ఉదయం బాలిక అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమె బంధువులు ఆగ్రహావేశంతో పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యపు సమాధానం వారిని మరింత ఆగ్రాహావేశాలకు గురి చేసింది.
వికాస్ హైస్కూల్పై మూకుమ్మడిగా విధ్వంసం సృష్టించారు. ప్రిన్సిపాల్పై దాడి చేయడంతో పాటు స్కూల్లో కనిపించిన కుమార్పై కూడా దాడి చేశారు. ఈ క్రమంలో పాఠశాల ఆవరణలో నిలిపి ఉంచిన రెండు బస్సులకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో రెండు బస్సులు కూడా మంటల్లో తగలబడిపోయాయి.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనఫై సమాచారం అందుకున్న పోలీసులు పీఈటీ కుమార్ను అదుపులోకి తీసుకుని సిద్ధిపేట జీఎంసీ కార్యాలయానికి తీసుకెళ్లారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications