తెలంగాణలో పోలింగ్ వేళ.. కార్లల్లో భారీగా నగదు పట్టివేత
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది.
పోలింగ్ను సజావుగా కొనసాగించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఓటర్లు అధికారాన్ని ఎవరికి కట్టబెట్టారనేది తేలిది అప్పుడే.

పోలింగ్ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారీగా నగదు వెలుగు చూస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో కోట్ల రూపాయల మేర నగదు, మద్యం బాటిళ్లను ఎన్నికల సిబ్బంది, టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి బ్రేకులు పడట్లేదు. ప్రచారం ముగిసిన తరువాత కూడా పెద్ద ఎత్తున నగదు లభిస్తోంది.
తాజాగా- హైదరాబాద్ శివార్లల్లో 1.68 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తెల్లవారు జామున ఖాజాగూడ వద్ద మాదాపూర్, రాయదుర్గం స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తోండగా.. అక్రమంగా తరలిస్తోన్న ఈ నగదు వెలుగులోకి వచ్చింది.
ఈ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ 11 ఏపీ 2098 రిజిస్ట్రేషన్ గల కారుతో పాటు మరో వాహనాన్ని సీజ్ చేశారు. అందులో ప్రయాణిస్తోన్న వారిపై కేసు నమోదు చేశారు. ఈ నగదుకు సంబంధించిన ఎలాంటి రసీదు కూడా వారి వద్ద లేదని పోలీసులు నిర్ధారించారు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications