Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రమంత్రికి సీఎం కేసీఆర్ కీలక సూచనలు: బాగున్నాయని అభినందించిన ప్రధాని మోడీ

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. కరోనా నియంత్రణకు రాష్ట్రం చేపడుతున్న చర్యలను ఆయనకు సీఎం వివరించారు. కరోనా నియంత్రణకు కొన్ని సూచనలు చేశారు.

కేంద్రమంత్రి హర్షవర్ధన్‌కు కేసీఆర్ ఫోన్.. కీలక సూచనలు

కేంద్రమంత్రి హర్షవర్ధన్‌కు కేసీఆర్ ఫోన్.. కీలక సూచనలు

కరోనా వ్యాప్తికి కారణమవుతున్న వారిని గుర్తించి టీకాలు వేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, గ్యాస్ డెలివరీ బాయ్స్, వీధి వ్యాపారులు, కార్మికులను గుర్తించి వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు. కేసీఆర్ సూచనలపై హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించారు. ప్రధానితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

కేసీఆర్‌ను అభినందించిన ప్రధాని మోడీ

కేసీఆర్‌ను అభినందించిన ప్రధాని మోడీ

అనంతరం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు సీఎం. కేసీఆర్ సూచనలు బాగున్నాయని, కేంద్రమంత్రి హర్షవర్ధన్ తనకు వివరించారని మోడీ తెలిపారు. వాటిని ఆచరణలో పెడతామని చెప్పారు. మంచి సూచనలను చేసినందుకు కేసీఆర్‌ను ప్రధాని అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడిసివిర్ ఔషధాలను సరఫరా చేయాలని ప్రధానిని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

50వేల మంది వైద్య సిబ్బందికి నియామకానికి ఆదేశం

50వేల మంది వైద్య సిబ్బందికి నియామకానికి ఆదేశం

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50వేల మంది ఎంబీబీఎస్ పూర్తి చేసి సిద్ధంగా ఉన్న అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ వైద్యాధికారులను ఆదేశించారు. అంతేగాక, వీరికి గౌరవ ప్రదమైన రీతిలో జీతాలు అందించాలని అన్నారు.

వీరందరికీ కరోనా వంటి కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరైన గుర్తింపునివ్వాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులను కలపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కష్టకాలంలో ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకు రావాలని సీఎం కేసీఆర్ యువ డాక్టర్లకు పిలుపునిచ్చారు.
https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx. డాక్టర్లతోపాటు అర్హత ఉన్న నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు.. 729 మంది వైద్య సిబ్బంది నియామకం

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు.. 729 మంది వైద్య సిబ్బంది నియామకం

వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను తక్షణమే ప్రారంభించాలని, వైద్య సిబ్బందిని నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎంజీఎంకు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, ఆదిలాబాద్ జిల్లా రిమ్స్‌లోని మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తక్షణమే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

సీఎంఎస్ఎస్‌వై కింద ఎంజీఎంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వ వాటా కింద తక్షణం అందజేయాల్సిన 8 కోట్ల రూపాయలను, రిమ్స్‌లో ఇదే పథకం కింద నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రభుత్వ వాటా కింద 20 కోట్ల రూపాయలను, మొత్తం 28 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.
అంతేగాక, వరంగల్ ఆస్పత్రి కోసం 363 మంది వైద్య సిబ్బందిని, ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం 366 మంది వైద్య సిబ్బందిని, మొత్తం 729 మంది సిబ్బంది నియామకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+