కాంగ్రెస్ - జెడీయస్ కూటమిని ప్రభుత్వ ఏర్పా టుకు ఆహ్వానించాలి: రేవంత్ రెడ్డి
ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్ల పాత్ర పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని కాంగ్రేస్ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. సంపూర్ణ మెజార్టీ రానప్పుడు గవర్నర్లు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలని, గోవా లో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా బిజెపి కి అవకాశం ఇచ్చిన సందర్బాన్ని ఆయన గుర్తు చేసారు. మణిపూర్, మేఘాలయ ల్లో ఎన్నికల తర్వాత ఏర్పాటైన కూటములకు గవర్నర్లు అవకాశం ఇవ్వలేదా అని ప్రశ్నించారు.
సర్కారియా కమిషన్ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వాల ఏర్పాటు కోసం గవర్నర్ తసుకోవాల్సిన నిర్ణయాలను రేవంత్ వివరించారు. 1.పూర్తి మెజార్టీ, 2.ఎన్నికల ముందు ఏర్పాటైన కూటమి మెజార్టీ సాధిస్తే, 3. ఎన్నికల తరువాత కూటమి ఏర్పాటైన తర్వాత మెజార్టీ... 4. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం ఆనవాయితీ అని తెలిపారు.

భారత రాజ్యాంగం పైన మోడీ, అమిత్ షా లకు నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాలని హితవు పలికారు. కర్ణాటకలో ఫిరాయింపులను పరోక్షంగా గవర్నర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ, తక్షణం కాంగ్రెస్ - జెడీయస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్ చేసారు. ఒక్క ఓటుతో వాజపాయి ప్రభుత్వం అదికారం కోల్పోయిందని. మళ్లీ అదికారం చేజిక్కించుకొనే అవకాశం ఉన్నా అద్వానీ, వాజపాయి లు అక్రమ మార్గాల వైపు చూడలేదని గుర్తుచేసారు. జేడీఎస్ కు మద్దతిచ్చిన కేసీఆర్, జేడీఎస్ ఏ పార్టీతో కలిసి ప్రబుత్వం ఏర్పాటు చేయాలో చెప్పాలని అన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications