మహిళా టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. !!
సావిత్రీబాయి ఫూలే 195వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె జయంతి రోజైన జనవరి 3వ తేదీని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
మహిళల విద్యకు సావిత్రీబాయి ఫూలే అందించిన అపారమైన కృషికి నివాళి అర్పించడమే ఈ ప్రత్యేక దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి 10 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను గుర్తించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించారు.

ఈ ఆదేశాల మేరకు- జిల్లా కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు.. అన్ని ప్రభుత్వ పాఠశాలల నుండి హెడ్ మాస్టర్, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, తత్సమాన కేడర్లలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు అత్యుత్తమ బోధనను అందించిన ప్రభుత్వ, మున్సిపల్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పని చేస్తోన్న మహిళా ఉపాధ్యాయులను జిల్లాకు 10 మంది చొప్పున ఎంపిక చేయాలి. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (KGBV), మోడల్ పాఠశాలలను కూడా ఇందులో చేర్చారు.
ఆయా పాఠశాలల నుండి ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఎంపికైన మహిళా ఉపాధ్యాయులను జనవరి 3వ తేదీన జిల్లా స్థాయిలో ఘనంగా సన్మానించే కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించాలని పాఠశాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ నవీన్ నికొలాస్ ఆదేశించారు. ఈ సన్మాన కార్యక్రమాలకు అవసరమైన నిధులను జిల్లా విద్యాశాఖాధికారుల వద్ద అందుబాటులో ఉన్న నిధుల నుండి సమకూర్చుకోవాలని పేర్కొన్నారు.
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications