ఏప్రిల్ 27 నుంచి వేసవి సెలవులు -రేపే లాస్ట్ వర్కింగ్ డే -జూన్1లోపు కరోనా తగ్గితేనే స్కూళ్లు రీఓపెన్
కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా మారడంతో ఇప్పటికే కొన్ని పరీక్షలు రద్దు చేసి, మరికొన్నింటిని వాయిదా వేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం వెల్లడించారు.
సీఎం రివ్యూ.. వెంటనే నిర్ణయం..
కరోనా పరిస్థితులు, వేసవి కాలం, విద్యా సంస్థలు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. కొవిడ్ వ్యాధికి గురైన సీఎం తన ఫామ్ హౌజ్ నుంచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో సమీక్ష చేశారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవులపై సీఎం సమీక్షించారని, ఆ వెంటనే నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి సబిత తెలిపారు.
ఏప్రిల్ 26 లాస్ట్ వర్కింగ్ డే
రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి సబితా గుర్తు చేశారు. అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి వేసవి సెలవులు మొదలుకానుండటంతో సోమవారం(ఏప్రిల్ 26వ తేదీని) ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు. కాగా,
కరోనా తగ్గాకే స్కూళ్ల రీఓపెనింగ్..
ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటించిన ప్రభుతవం.. పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేదిమాత్రం స్పష్టంగా పేర్కొనలేదు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుదల, కోవిడ్ 19 పరిస్థితులకు అనుగుణంగా జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి సబిత తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం తెలంగాణలో కొత్తగా 8126 కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. వాతావరణం పరంగా తెలంగాణలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు విపరీతంగా కాస్తుండగా.. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
షాకింగ్: ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలుడు -27మంది కొవిడ్ రోగులు దుర్మరణం, మరో 50 మందికి