Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలోని ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్

గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు పని కల్పించి.. ఆర్థికంగా భరోసాను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. 2006 నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) దిగ్విజయంగా కొనసాగుతూ వస్తోంది. ఈ పథకం కింద పేదలకు 100 రోజల పని దొరుకుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఏపీలో ఉపాధి కూలీని రూ. 300 నుంచి రూ. 307కు పెంచిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కూలీ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

గ్రామీణ ప్రాంతాల్లో కరువు పనికి వెళ్లే కూలీలకు గుడ్ న్యూస్. ఇప్పటికే కూలీ రేట్లను పెంచిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు దురదృష్టవశాత్తు మృత్యువాత పడుతున్న ఘటనలు అధికం అవుతున్న తరుణంలో వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని.. ఈ మేరకు వారికి బీమా పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల పరిహారం లభించనుంది.

దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగు పరచడం కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS)ను 2006 లో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత కూలీల కోసం అనేక సంస్కరణలు చేపడుతూ వస్తోంది. ఇందులో భాగంగానే రూ. 300 ఉన్న రోజు వారీ వేతనాన్ని రూ.307కు పెంచింది. తాజాగా గ్రామీణ కూలీల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే తెలంగాణలోనూ కూలీలకు ఈ బీమా పథకాన్ని అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.


ఈ పథకం కింద కేవలం రూ.20 వార్షిక ప్రీమియంతో నమోదు చేసుకున్న కూలీలు ప్రమాదవశాత్తు మరణించినా.. లేదా పూర్తి అంగవైకల్యం అయినా రూ. 2 లక్షల నష్టపరిహారం.. పాక్షికంగా అంగవైకల్యం కలిగితే రూ. లక్ష పరిహారం వస్తుంది. ఈ మేరకు ఈ పథకంలో కూలీల పేర్లను నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.

Telangana Employment Guarantee Workers to Get Rs 2 Lakh Insurance Cover

ఈ బీమా పథకానికి 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఈ బీమా పథకంలో చేరవచ్చు. అయితే ఏటా తమ ఖాతా నుంచి రూ.20 బీమా ప్రీమియంను చెల్లించడానికి అనుమతిస్తూ లెటర్ ఇవ్వాలి. ప్రతీ సంవత్సరం జూన్ ఒకటి నుంచి మే 31 వరకు బీమా అమల్లో ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+