ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగి 60 ఏళ్ల లోపు మరణించిన సందర్భంలో ఇప్పటికే అందుతున్న ప్రయోజనాలతో పాటు.. అదనంగా ₹10 లక్షల ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఉద్యోగ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17.7 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం పొందే అవకాశం లభించనుంది. రాష్ట్రంలోని గుర్తింపు పొందిన 652 ఆసుపత్రుల్లో 1998 రకాల వ్యాధులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ హెల్త్ స్కీమ్ నిర్వహణ కోసం ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5 శాతం చొప్పున ట్రస్టు ఖాతాలో జమ చేయగా, ప్రభుత్వం కూడా సమాన మొత్తాన్ని అందించనుంది. ఉద్యోగుల నుంచి సుమారు ₹528 కోట్ల నిధులు సమీకరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన కార్యదర్శి (CS) ఆధ్వర్యంలో సభ్యులతో కూడిన కమిటీ ట్రస్టు నిర్వహణను పర్యవేక్షించనుంది.
కేబినెట్ నగదు రహిత వైద్య చికిత్స పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగులు, పెన్షనర్లకు చికిత్స సమయంలో ఆర్థిక భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. జిల్లా, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య వసతులు, ఆధునిక పరికరాలు, స్పెషలిటీ సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
అదనంగా, ఈ పథకం ద్వారా అవుట్పేషెంట్ సేవలు, అత్యవసర చికిత్స, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణకు కూడా సహాయం అందేలా ప్రతిపాదనలు ఉన్నాయి. డిజిటల్ హెల్త్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేసి పారదర్శకత పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అలాగే కుటుంబ సభ్యులను కూడా పథకంలో చేర్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
మొత్తంగా ఈ నిర్ణయాలు ఉద్యోగుల ఆరోగ్య భద్రతను పెంచడమే కాకుండా కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించే సంక్షేమ చర్యలుగా భావిస్తున్నారు. అలానే హైదరాబాద్ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన 2027 విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లపై మంత్రివర్గ భేటీలో చర్చ జరిగింది.
-
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ











Click it and Unblock the Notifications