టీఎస్పీఎస్సీ నూతన ఛైర్మన్ గా మాజీ డీజీపీ - సీఎం రేవంత్ నిర్ణయం..!!
తెలంగాణలో మరో కీలక నియామకం పైన సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ పేరును ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆమోదం కోసం గవర్నర్ కు సిఫార్సు చేసింది. ఈ పదవి కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఛైర్మన్ పదవికి 50కి పైగా అప్లికేషన్లు వచ్చాయి. కాగా, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఛైర్మన్ గా ఎంపిక చేసారు. గవర్నర్ ఆమోదం తరువాత అధికారికంగా నియామక ఉత్తర్వులు జారీ కానున్నాయి.
టీఎస్పీఎస్సీకి కొత్త ఛైర్మన్: బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్షల నిర్వహణలో పలు విమర్శలు ఎదుర్కొంది. పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం పైన నాటి ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. గత ప్రభుత్వంలో నియమించిన టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులు రాజీనామా చేసారు.

వాటికి ఆమోదం లభించటంతో టీఎస్పీఎస్సీకి కొత్ ఛైర్మన్, సభ్యల నియామకం పైన ప్రభుత్వం కసరత్తు చేసింది. దీంతో, చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు.. సభ్యుల పదవులకు 320 వచ్చాయి. విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే రేవంత్ టీఎస్పీఎస్సీ నియామకాల పైన సమీక్ష చేసారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన కమిటీ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది.
మాజీ డీజీపీకి ఛాన్స్: దీంతో, కొత్త ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు ప్రతిపాదించారు. డీజీపీగా పనిచేసి రిటైరైన వారిలో 62 ఏళ్లలోపు ఉన్న మాజీ అధికారి మహేందర్ రెడ్డి మాత్రమే ఉన్నారు. చైర్మన్ పోస్టుకు ఆయన పేరునే ప్రభుత్వం ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.
ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన ఎంపిక ద్వారా నిరుద్యోగుల్లో నమ్మకాన్ని ఏర్పరచడంతో పాటు నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. సభ్యుల పదవుల కోసం కోసం వివిధ రంగాలకు చెందిన వారి నుంచి సుమారు 371 దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. ఇందులో 50కి పైగా చైర్మన్ పోస్టు కోసం వచ్చినట్టు సమాచారం. టీఎస్పీఎస్సీ చైర్మ న్ పోస్టుతోపాటు 11 సభ్యుల పోస్టులు ఉన్నాయి ప్రస్తుతం ఇద్దరు సభ్యులు కొనసాగుతున్నారు.

ప్రభుత్వం కసరత్తు: ఇందులో ఒక సభ్యురాలు రాజీనామా చేసినా ఇంకా గవర్నర్ ఆమోదించలేదు. మరో సభ్యురాలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. దాంతో మొత్తం 11 పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. సాంకేతికంగా ప్రస్తుతం 9 సభ్యుల పోస్టు లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం చైర్మన్ పోస్టుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వం గవర్నర్కు పం పించినట్టు తెలిసింది. టీఎస్పీఎస్సీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.
టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా స్వయంగా సీఎం రేవంత్రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ను కలిసి చర్చించారు. అధికారులు కేరళవంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడి వ్యవస్థను పరిశీలించారు. ఇక, ఇప్పుడు గవర్నర్ ప్రభుత్వం పంపిన పేర్లను ఆమోదించిన తరువాత మహీందర్ రెడ్డిని అధికారికంగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా నియమించే అవకాశం కనిపిస్తోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications