Telangana: వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
Telangana: గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఎవరికీ కేటాయించని డబుల్ బెడ్రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్-2(సొంత స్థలం లేనివారు) జాబితాలోని వారికి కేటాయించాలని రేవంత్ సర్కారు కసరత్తు ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాను ప్రభుత్వం ఎల్-1(సొంత స్థలం ఉన్న వారు), ఎల్-2(సొంత స్థలం లేనివారు), ఎల్-3(ఇళ్లు ఉన్నా దరఖాస్తు చేసుకున్నవారు)గా విభజించిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ల యాప్ సర్వే ద్వారా ఎల్-1 జాబితాలో సొంత స్థలం ఉన్న 21.93 లక్షల మందిని రేవంత్ సర్కారు చేర్చింది. వారికి ఇల్లు కట్టుకునేందుకు విడతల వారీ రూ.5లక్షలను అందించనుంది. ఎల్-2 జాబితాలో సొంత స్థలాలు లేని 19.96 లక్షల మందికి.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థలాన్ని కేటాయించడంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలను ఇవ్వనుంది. ఎల్-2 జాబితాలో ఉన్న 80 వేల మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చాలా మందికి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎశ్ సర్కారు పదేళ్లలో 2.36 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసి.. 1.58 లక్షల ఇళ్లను పూర్తి చేసింది. పూర్తి చేసిన వాటిలోనూ 1.36 లక్షల ఇళ్లను పంపిణీ చేయగా..

మిగతావి అలాగే ఉన్నట్లు తెలిసింది. మరికొన్ని నిర్మాణ దశల్లో ఉండగా.. వాటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లతో హౌసింగ్ బోర్టు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమచారం. చాలా మంది కాంట్రాక్టర్లు బిల్లులు రాకపోవడంతో పనులను మధ్యలోనే ఆపేశారు. ఆ కాంట్రాక్టర్లు మళ్లీ ముందుకొస్తే ఇసుకతో పాటు ఇతర రాయితీలు ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేయించాలని హౌసింగ్ బోర్డు భావిస్తోంది. అందులో భాగంగా మధ్యలోనే నిర్మాణం ఆగిపోయిన ఇళ్ల సమాచారాన్ని సేకరించింది. ఆ నిర్మాణాల విషయం కూడా త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications