రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. రైతుల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఈ నిధులను సీఎం రేవంత్ విడుదల చేసారు. మూడు విడతల్లో పూర్తి స్థాయిలో నిధులు అర్హత ఉన్న ప్రతీ రైతు ఖాతాలో జమ అవుతాయని వెల్లడించారు. అందరికీ ఒక ఎకారిని రూ 6 వేలు వారి ఖాతాల్లో జమ చేసారు. నిర్దేశించిన సమయం మేరకు రెండు, మూడు విడతల్లో పూర్తి స్థాయిలో ఈ నిధులు జమ కానున్నాయి. అయితే, తొలి విడత నిధులు జమ కాని రైతులకు అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన లబ్దిదారులందరికీ తొలి ఎకరానికి రూ.6 వేలు జమ చేయగా.. రెండు, మూడు విడతల్లో అన్ని ఎకరాలకు అందించనున్నారు. నిధులు విడుదల చేసినా.. ఆదివారం బ్యాంకుల కు సాధారణ సెలవు కావడంతో సోమవారం లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా, ఇదే సమయంలె అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకుంటే.. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇక మండల వ్యవసాయ అధికారిని కలిసి ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా అర్హల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవటంతో పాటుగా బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ అయిందా..? లేదా..? బ్యాంక్ కేవైసీ యాక్టివ్లో ఉందా..? లేదా? అనే వివరాలు పరిశీలన చేయాలని సూచన చేస్తున్నారు. అదే విధంగా పాస్ బుక్ వివరాలు ధరణి పోర్టల్లో చెక్ చేసుకుని రిజిస్టర్ అయ్యాయా..? లేదా? అనే డీటైల్స్ తనిఖీ చేయటం అవసరమని పేర్కొన్నారు.

కాగా, కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన సమయంలో సకాలంలో రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. గడువులోగా చేసుకోకపోతే డబ్బులు పడవని చెబుతున్నారు. నగదు జమ కాని రైతులు తమ స్థానిక అధికారులను అడిగి సమస్యను పరిష్కరించుకుంటే తర్వాతి విడతలో డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేసారు. ఎవరికైనా సాంకేతిక సమస్యలతో నగదు జమ కాకుంటే అధికారుల కు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని వెల్లడించారు. ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు తప్పనిసరి చేసారు. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో రిజిస్ట్రర్ అయి ఉండాలి. లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం తొలి ఎకరానికి ప్రభుత్వం రైతు భరోసా అందిస్తోంది. ఎన్ని ఎకరాలు ఉన్నవారికైనా సరే తొలి ఎకరానికి రూ.6 వేలు తొలి విడతలో పొందనున్నారు. లబ్దిదారులందరీ అకౌంట్లలో రూ.6 వేల జమ కానున్నాయి. రైతు భరోసా అందనివారు అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచిస్తోంది. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం













Click it and Unblock the Notifications