కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలా?: కేంద్రంపై హరీశ్ రావు వరుస ట్వీట్లు
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)కు జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన పంపలేదని చేస్తున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై పార్లమెంటులో కేంద్రం చేసిన ప్రకటనపై మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిందని హరీశ్ రావు గుర్తు చేశారు. రాజకీయ కక్షతోనే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం లేదని కేంద్రంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తున్నారని అన్నారు.

తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో కేంద్రం వివక్షను ఎండగడుతూ హరీశ్ రావు వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేసిన విజ్ఞప్తులను కూడా జతచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్న కేంద్రమంత్రి బిశ్వేశర్ తుడు వ్యాఖ్యలు అవాస్తవం. జాతీయ హోదా కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్, నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను ఎన్నోసార్లు ప్రధానికి, జలశక్తి శాఖ మంత్రికి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చాం. వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంట్లో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సభను, ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉంది అని హరీశ్ రావు పేర్కొన్నారు.
'కేంద్ర మంత్రి చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. కేంద్ర జల శక్తి శాఖకు చెందిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు కూడా లభించాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
CWC accorded approval to the Upper Bhadra Project of Karnataka, a BJP ruled State when KWDT II award was stayed by SC in 2013. CWC accorded clearances to Upper Bhadra Project and GoI also accorded NP status for a project when the whole matter was subjudice
— Harish Rao Thanneeru (@BRSHarish) March 17, 2023
For Kaleshwaram… https://t.co/ZqSs2Ke5TY pic.twitter.com/yMhWsVWaV1
2018లో టీఆర్ఎస్ ఎంపీలు కాళేశ్వరానికి జాతీయ హోదాపై పార్లమెంట్లో ప్రశ్నించగా.. నాటి జలశక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరి స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి సమీప భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన లేదన్నారు. కానీ ఈ ప్రకటనకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు, మధ్యప్రదేశ్లోని కెన్ - బెట్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. తెలంగాణ ప్రతిపాదనను మాత్రం పక్కన పెట్టింది. ఇది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ రాజకీయ వివక్షకు నిదర్శనమని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేడబ్ల్యుడీటీ-2 కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చింది. న్యాయవిచారణ పూర్తికాకముందే కేంద్ర ప్రభుత్వం ఏకంగా జాతీయ హోదా ప్రకటించింది. కానీ అన్ని రకాల అనుమతులు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జాతీయ హోదా ప్రకటించలేదు. ఇది రాజకీయ కక్ష కాదా? అని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా నిలదీశారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications