సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేద్దామా?: ట్విట్టర్‌లో కేటీఆర్, నెటిజన్ల అభిప్రాయాలు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను విలీనం చేయాలనే విషయంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రజాభిప్రాయాన్ని కోరారు. విలీనం చేయమని కొందరు కోరుతున్న వార్తలను తాను చదవినట్లు ఆయన తెలిపారు.

ఈ వాదనతో తానూ ఏకీభవిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ట్విట్టర్ వేదికగా ప్రయత్నించారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై మీరేమంటారు? అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

అయితే, కొందరు విలీనం చేసేందుకు సుముఖంగా అభిప్రాయాలను వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం విలీనం చేయవద్దంటూ కోరారు. కేంద్రం ఆధీనంలో ఉన్న భూములను ఎలా విలీనం చేస్తారంటూ ప్రశ్నించారు మరికొందరు.

కాగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనేది సికింద్రాబాద్ సైనికనివాస ప్రాంతానికి చెందిన పౌర పరిపాలనా సంస్థ. ఇది భౌగోళికంగా హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ఉంది. భారతదేశంలో మొదటి అతిపెద్ద బతిండా సైనిక నివాసప్రాంత మండలి తరువాత సికింద్రాబాద్ సైనికనివాస ప్రాంతమండలి రెండవ అతిపెద్దదిగా గుర్తించబడింది.

సికింద్రాబాద్ సైనికనివాస ప్రాంతమండలి పరిధిలో నాలుగు లక్షల జనాభాతో, ఎనిమిది పౌర వార్డులును కలిగిఉంది. ప్రధానంగా సైనిక ప్రాంతం కావడంతో, సికింద్రాబాద్ సైనికనివాస ప్రాంతమండలి భారత ప్రభుత్వ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చింది. ఇది 40.1 కి.మీ2 (15.5 చ. మై.) విస్తీర్ణంపై పరిపాలనను పర్యవేక్షిస్తోంది. ఇక్కడ అనేక సైనిక శిబిరాలు ఉన్నాయి.

2011 భారత జనాభా గణన ప్రకారం ఈ ప్రాంతంలో 2,17,910 మంది జనాభాతో, 22.81చ.కి.మీ (8.81చ.మైళ్లు) విస్తీర్ణంలో 50,333 కుటుంబాలు కలిగిన ఇళ్లను కలిగిఉంది. సైనికశిబిర పౌర ప్రాంతాల మౌలిక సదుపాయాల నిర్వహణను సైనికశిబిర పౌర పరిపాలన మండలి చూసుకుంటుంది. 2006 సైనికశిబిర పౌర ప్రాంతాల చట్టం ప్రకారం, ఇది మొదటి తరగతి సైనికశిబిర పౌర ప్రాంతంగా వర్గీకరించబడింది.

Telangana minister KTR seeks public opinion on merger of Cantonment Board with GHMC

భారత సైన్యం తెలంగాణ, ఆంధ్ర ఉప ప్రాంతాల సేనాధిపతి (జిఓసి) లేదా ఉప జిఓసి అధ్యక్షతన సైనికశిబిర పౌర ప్రాంతాల మండలి పనిచేస్తుంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నియమించిన భారత సైనికదళాల ప్రాంత అధికారికి (సిఇఒ) మండలి కార్యనిర్వాహక అధికారాలును కలిగి ఉన్నాయి. మండలి సార్వత్రిక ఎన్నికలలో కంటోన్మెంట్ ప్రాంతంలో నివసిస్తున్న పౌర జనాభా ద్వారా సగం మంది సభ్యులు ఎన్నుకోబడతారు. మిగిలిన సగంమంది సభ్యులు హైదరాబాద్ జిల్లా కలెక్టరు, కంటోన్మెంట్ ప్రాంతం మండలి అధ్యక్షుడు, సిఇఒ, ఈ ముగ్గురు నియమించిన ఇతర సైనిక అధికారులు ఉంటారు. బోర్డులో సభ్యులు కాకపోయినప్పటికీ, కంటోన్మెంట్ చట్టం ప్రకారం స్థానిక ఎంపి, ఎమ్మెల్యేలను మండలి సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పరిగణిస్తారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తాగునీరు, మురుగునీటి పారుదల, రోడ్లు, చెత్త తొలగింపు, ప్రజారోగ్యంలాంటి పౌర సౌకర్యాలును, పురపాలకక పన్నులు మొదలైన వాటికి కంటోన్మెంట్ బోర్డు బాధ్యత వహిస్తుంది. ప్రధాన కార్యాలయాలు కంటోన్మెంట్ అంచుకు సమీపంలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి భవనంలో ఉన్నాయి. ఈ సముదాయంలో కోర్టు, హైదరాబాద్ నగర పోలీసుల జోనల్ డిసిపి కార్యాలయం ఉన్నాయి.

మురుగునీటి పారుదల మార్గాలను కొత్తగా ఏర్పాటు చేయడం, పని రోజులో కార్మికులు అడ్డుపడే మ్యాన్‌హోల్స్‌ను క్లియర్ చేయడాన్ని నిర్వహించడంలాంటి పనులను సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తరచుగా నిర్వహిస్తుంది. ఏదైనా భవన నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు, అన్ని గృహ ప్రణాళికలను కంటోన్మెంట్ ఆమోదించాలి. కంటోన్మెంట్ నివాసితుల గృహలకు చెల్లించవలసిన పన్నులు వార్షిక ప్రాతిపదికన చెల్లించటానికి మొత్తాలతో బిల్లులను పంపుతుంది.వాటి ఆధారంగా కంటోన్మెంట్ ప్రధాన కార్యాలయంలో పన్నులు వసూలు చేయబడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+