'హెచ్చరిక.. మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి'
తెలంగాణ జేఏసీ తలపెట్టిన ర్యాలీలో సంఘ విద్రోహశక్తులు జొరబడే అవకాశం ఉందని, అందుకే అనుమతివ్వలేదని పోలీసులు మంగళవారం తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ తలపెట్టిన ర్యాలీలో సంఘ విద్రోహశక్తులు జొరబడే అవకాశం ఉందని, అందుకే అనుమతివ్వలేదని పోలీసులు మంగళవారం తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.
సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవీస్ విలేకరులతో మాట్లాడారు. రేపు (బుధవారం) జేఏసీ నిర్వహించే ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. ర్యాలీలో పాల్గొంటే విద్యార్థులపై కేసులు పెడతామని హెచ్చరించారు.

విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని చెప్పారు. ఇందిరా పార్క్ వద్దకు ఎవరికీ అనుమతి లేదని చెప్పారు. అనుమతి లేని ర్యాలీలో ఎవరైనా పాల్గొంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
జిల్లాల నుంచి విద్యార్థులు, జేఏసీ నాయకులు హైదరాబాద్కు రాకూడదని సూచించారు. నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇందిరాపార్క్ వద్ద నిషేదాజ్ఞలు అమలులో ఉన్నట్లు చెప్పారు.
విద్యార్థులు ర్యాలీలో పాల్గొనకుండా విద్యా సంస్థలు కట్టడి చేయాలన్నారు. ర్యాలీకి అనుమతి లేని విషయాన్ని అన్ని జిల్లాల ఎస్పీలకు ఇప్పటికే తెలిపామన్నారు.
అనుమతి లేదు: డిజిపి
బుధవారం నాడి జేఏసీ సభకు అనుమతి లేదని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. జిల్లాల నుంచి ఎవరూ రావొద్దని సూచించారు. అసాంఘిక శక్తులు చొరబడే అవకాశముందనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అనుమతి నిరాకరించామన్నారు. విద్యార్థులను నిరుద్యోగ ర్యాలీకి పంపించవద్దని తల్లిదండ్రులు, విద్యార్థులకు సూచించారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications