తెలంగాణలో టీచర్లకు కీలక బాధ్యతల అప్పగింత
జనాభా లెక్కల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టింది. 2027లో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణ ఇది. దీనికోసం దాదాపు 90,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించనుంది. ఇది దేశంలో పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరిగే తొలి జనాభా గణన కావడంతో ప్రభుత్వం సమగ్ర సన్నాహాలు ప్రారంభించింది. సకాలంలో కార్యాచరణ ప్రణాళిక, బాధ్యతలపై అవగాహన కల్పించడానికి త్వరలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది.
ఈ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయి జన గణన సమన్వయ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. జిల్లా స్థాయిలో పరిపాలన, లాజిస్టికల్, కార్యాచరణ ఏర్పాట్లను సమీక్షించారు. 2027 జన గణనను విజయవంతం చేయడానికి సమన్వయం అవసరమని, సకాలంలో నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. దీనికి అన్ని శాఖలు సహకారం అందించాలని సూచించారు.

అధికారులకు ఉద్యోగుల తాత్కాలిక అంచనా సిద్ధం చేయాలని రామకృష్ణా రావు ఆదేశాలు ఇచ్చారు. డిజిటల్ గణనలో మురికివాడలు, మారుమూల ప్రాంతాలన్నీ కవర్ చేయాలని, ఎటువంటి లోటుపాట్లు కూడా ఉండకూడదని అన్నారు. ఈ విషయంలో జనాభా గణాంకాల సిబ్బందికి నాణ్యమైన శిక్షణ చాలా ముఖ్యమని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. సెన్సస్ డిజిటల్ విధానంలో లోపాలు తలెత్తకూడదని, మారుమూల గ్రామాలు, తండాలు, చిన్న చిన్న ఆవాసాలను పరిగణనలోకి తీసుకునేటప్పుడు డబుల్ ఎంట్రీలు ఉండకూడదని సూచించారు.
ఈ సందర్భంగా జన గణన డైరెక్టర్ భారతి హోలికేరి మాట్లాడుతూ.. 2027 గణన కోసం తొలి దశలో మొత్తం 90,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించనున్నట్లు తెలిపారు. వీరిలో ప్రధానంగా ఉపాధ్యాయులు ఉంటారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు జనాభా లెక్కింపుదారులు, సూపర్ వైజర్లుగా నియమితులవుతారని ఆమె తెలిపారు.
ఈ సమావేశానికి ఆర్థిక ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, అటవీ ముఖ్య కార్యదర్శి నదీమ్ అహ్మద్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా ఛోంగ్తు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్, సాధారణ పరిపాలన కార్యదర్శి ఈ శ్రీధర్, మున్సిపల్ కార్యదర్శి టీకే శ్రీదేవి హాజరయ్యారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications