మిషన్ కాకతీయకు వెయ్యి కోట్లు: హరీష్(ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు నాబార్డ్ నుంచి రూ. వెయ్యి కోట్ల రుణం మంజారుకు మార్గం సుగమమైందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు చెప్పారు. రాష్ట్రంలోని 2,060 చెరువుల మరమ్మతులకు నిధులిచ్చేందుకు నాబార్డు అంగీకరించిందన్నారు.
జనవరి 17న ముంబైలో జరిగే నాబార్డు బోర్డు మీటింగ్లో ఆమోదించిన వెంటనే రూ. వెయ్యి కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం సచివాలయంనుంచి జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, మైనింగ్ అధికారులతో మంత్రి సుమారు నాలుగు గంటలపాటు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

మిషన్ కాకతీయకు వెయ్యి కోట్లు: మంత్రి హరీష్
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు నాబార్డ్ నుంచి రూ. వెయ్యి కోట్ల రుణం మంజారుకు మార్గం సుగమమైందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు చెప్పారు. రాష్ట్రంలోని 2,060 చెరువుల మరమ్మతులకు నిధులిచ్చేందుకు నాబార్డు అంగీకరించిందన్నారు.

మిషన్ కాకతీయకు వెయ్యి కోట్లు: మంత్రి హరీష్
జనవరి 17న ముంబైలో జరిగే నాబార్డు బోర్డు మీటింగ్లో ఆమోదించిన వెంటనే రూ. వెయ్యి కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం సచివాలయంనుంచి జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, మైనింగ్ అధికారులతో మంత్రి సుమారు నాలుగు గంటలపాటు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

మిషన్ కాకతీయకు వెయ్యి కోట్లు: మంత్రి హరీష్
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇకపై ప్రతి శనివారం ఉన్నతస్ధాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. జనవరి 25 నాటికి మిషన్ కాకతీయ కింద చేపట్టిన పనుల్లో 50 శాతం టెండర్ల ప్రక్రియ పూర్తికావాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించినట్లు తెలిపారు.

మిషన్ కాకతీయకు వెయ్యి కోట్లు: మంత్రి హరీష్
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్ధులకు చెరువుల పునరుద్ధరణపై వ్యాసరచన, ఉపన్యాసం, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రిపేర్స్, రిహాబిలిటేషన్, రెన్నోవేషన్(ఆర్ఆర్ఆర్) కార్యక్రమం కింద నిధులు సమీకరించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇకపై ప్రతి శనివారం ఉన్నతస్ధాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. జనవరి 25 నాటికి మిషన్ కాకతీయ కింద చేపట్టిన పనుల్లో 50 శాతం టెండర్ల ప్రక్రియ పూర్తికావాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించినట్లు తెలిపారు.
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్ధులకు చెరువుల పునరుద్ధరణపై వ్యాసరచన, ఉపన్యాసం, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రిపేర్స్, రిహాబిలిటేషన్, రెన్నోవేషన్(ఆర్ఆర్ఆర్) కార్యక్రమం కింద నిధులు సమీకరించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు.
మిషన్ కాకతీయకు నిధులు మంజూరుపై కేంద్ర మంత్రి ఉమాభారతి కూడా సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. ఈ దిశగా జిల్లా స్థాయి కమిటీలు వాటి అంచనాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు రూపొందించి కలెక్టర్ల ఆమోదంతో కేంద్రానికి పంపిస్తామన్నారు.
9,300 చెరువుల్లో ఆర్ఆర్ఆర్ కింద ఈ ఏడాది 5,322 చెరువుల సర్వే పూర్తి అయ్యిందని, 3,051 చెరువులకు అంచనాలు రూపొందుతున్నాయని, వాటిల్లో 480 చెరువులకు రూ.190 కోట్ల బడ్జెట్ను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు.












Click it and Unblock the Notifications