ఉట్నూర్లో టెన్షన్: దుకాణాలకు నిప్పు , వదంతులు నమ్మొద్దు: డీఐజీ
Recommended Video

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో ఆదిలాబాద్, లంబాడీల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఆందోళనకారులు పలు దుకాణాలకు నిప్పు పెట్టారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కొమరం భీమ్ విగ్రహన్ని అవమానించారంటూ ఆదీవాసీలు ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.

అయితే ఉద్దేశ్యపూర్వకంగానే కొమరం భీమ్ విగ్రహన్ని అవమానించారంటూ ఆదీవాసీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పలు దుకాణాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఉట్నూర్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అయితే పరిస్థితి చేజారకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
కొమురం భీమ్ విగ్రహన్ని అవమానించారని ఆందోళన చేసి తిరుగు ప్రయాణమైన వారిపై లంబాడీలు దాడి చేశారని ఆదీవాసీలు ఆరోపిస్తున్నారు. దీంతో రెండు వర్గాలు దాడులు పరస్పరం దాడులకు దిగారు.
తొలుత హస్నాపూర్ వద్ద ప్రారంభమైన దాడులు సానాపూర్తో పాటు ఉట్నూర్కు విస్తరించాయి. హుటాహుటిన డీఐజీ రవివర్మ ఉట్నూర్కు బయలుదేరి వెళ్ళారు.
ఉట్నూర్లో ఉండి డీఐజీ రవివర్మ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హైద్రాబాద్ నుండి అదనపు బలగాలను ఉట్నూర్కు పంపిన డీజీపీ.
ఎలాంటి వదంతులు నమ్మకూడదని డీఐజీ రవివర్మ సూచించారు. గిరిజన తండాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పెట్రోల్ బంక్, మద్యం దుకాణంతో పాటు పలు దుకాణాలకు నిప్పుపెట్టారు. అయితే ఈ దాడుల్లో ఎవరు కూడ చనిపోలేదని డీఐజీ రవి వర్మ ప్రకటించారు. పోలీసులపై కూడ ఆందోళనకారులు రాళ్ళు రువ్వారు. పలువురు గాయపడ్డారు.
ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ఉట్నూర్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు పది సార్లు బాష్పవాయువును ప్రయోగించారు. అంతేకాదు మూడు రోజుల పాటు 144 సెక్షన్ ను విధించారు. మరో వైపు పరిస్థితిని డీఐజీ రవివర్మ, కలెక్టర్ జ్యోతిబుద్దప్రసాద్ సమీక్షిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications