రైతులకు ప్రభుత్వం తీపి కబురు, సంక్రాంతి కంటే ముందే - ఖాతాల్లో నిధులు జమ..!!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైతులకు తీపి కబురు అందించింది. సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతకు ముందే రైతులకు మరో పథకం అమలుకు సిద్దం అయింది. అందులో భాగంగా తొలి విడత నిధులను విడుదల చేసింది. దీని ద్వారా సాగు చేసే రైతులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. తాజా పథకాన్ని మరింతగా విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం మరో పథకం అమలు ప్రారంభించింది. ఈ నెల నుంచే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమల్లోకి తీసుకు వస్తోంది. ఇందు కోసం 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఏకంగా రూ.101.83 కోట్లను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కలిసి అమలు చేయనుంది. కేంద్రం వాటాగా 60 శాతం ఇవ్వనుండగా.. 40 శాతం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పథకం ద్వారా రైతులకు సబ్సిడీకి వ్యవసాయ పనిముట్లు అందించనున్నారు. వ్యవసాయ పనిముట్లపై 50 శాతం రాయితీ పొందవచ్చు. ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులు గరిష్టంగా వ్యవసాయ పనిముట్లపై 50 శాతం రాయితీ పొందే అవకాశముండగా.. ఇతర వర్గాలవారు 40 శాతం తగ్గింపు పొందవచ్చని అధికారులు వెల్లడించారు.

కాగా, ఇప్పటికే ఈ పథకం కింద లబ్ది పొందేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 5.50 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా.. 1.30 లక్షల మంది రైతులను తొలుత ఎంపిక చేశారు. వీరికి త్వరలో రాయితీ సౌకర్యం కల్పించనున్నారు. వ్యవసాయానికి అవసరమయ్యే వివిధ రకాల పనిముట్లపై ఈ రాయితీ దక్కనుంది. ప్రభుత్వం నిధులు కూడా జమ చేయడంతో తక్కువ ధరకే పనిముట్లు లభించడం వల్ల రైతులపై ఆర్దిక భారం తగ్గుతుంది.
అయితే.. గతంలో ప్రభుత్వమే యంత్రాలను కొనుగోలు చేసి రైతులకు సబ్సిడీపై అందించేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది. ఐదు ఎకరాల్లోపు పోలం ఉన్న చిన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. 15 రకాల పనిముట్లు సబ్సిడీ జాబితాలో పొందుపర్చారు. వీటిపై రైతులకు సబ్సిడీ దక్కనుంది. ప్రభుత్వం ఎంపిక చేసిన కంపెనీల నుంచి కొనుగోలు చేస్తే రైతు వాటా మినహాయించి మిగతాది ప్రభుత్వం కంపెనీల అకౌంట్లోమ జమ చేస్తుంది. రూ.లక్షకు మించి కొనుగోలు చేసిన పరికరాలకు ప్రభుత్వం జియో ట్యాగింగ్ ఇవ్వనుంది.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications