గ్రూప్ 3 అభ్యర్థులకు గుడ్ న్యూస్. TGPSC కీలక అప్డేట్
రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పోటీ పరీక్షల ఫలితాలు, ధ్రువపత్రాల పరిశీలన, అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు గ్రూప్ 3 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది TGPSC బోర్డు. జూన్ 18 నుంచి గ్రూప్ 3 అభ్యర్థులకు సర్టిఫికెట్స్ పరిశీలన ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. జూన్ 18 నుంచి జులై 8 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది.
గ్రూప్ 3 అభ్యర్థులకు బిగ్ అలెర్ట్. రాష్ట్రంలోని 1,388 గ్రూప్ 3 ఉద్యోగాలకు గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేసింది TGPSC బోర్డు. జూన్ 18 నుంచి గ్రూప్ 3 అభ్యర్థులకు సర్టిఫికెట్స్ పరిశీలన ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. జూన్ 18 నుంచి జులై 8 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల కారణంగా ఆయా తేదీల్లో హాజరు కాలేని అభ్యర్థుల కోసం జూలై 9 రిజర్వ్ డేగా ఉంటుందని కమిషన్ వెల్లడించింది. హైదరాబాద్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ బిల్డింగ్ లో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొంది.

గ్రూప్ 3 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన రెండు సెషన్లలో ఉంటుంది. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి ఒంటిగంట 30 నిమిషాల వరకు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఉంటుందని కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు ఒక సెట్ సెల్ఫ్- అటె స్టెడ్ ఫోటో కాపీలు, రెండు సెట్ల అటె స్టేషన్ ఫామ్ లతోపాటు చెక్ లిస్టును కూడా తప్పనిసరిగా తీసుకురావాలని కమిషన్ స్పష్టం చేసింది.
ఈ మేరకు జూన్ 17 నుంచి జూలై 9 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ ను ఎంచుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. మిగిలిన వివరాల కోసం అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్సైట్ tspsc.gov.in ను సందర్శించాలని కమిషన్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications