ఇంటికే భద్రాద్రి రామయ్య కళ్యాణ తలంబ్రాలు - ఎలా పొందాలి..!!
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం ప్రతీ ఏటా వైభవంగా నిర్వహిస్తారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ సారి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ తలంబ్రాల తయారీకి శ్రీకారం చుట్టారు. కల్యాణం - మహా పట్టాభిషేకం ఉత్సవాలను ఆన్ లైన్ టికెట్లు అందుబాటులోకి తీసుకొ చ్చారు. ఇదే సమయంలో ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య కళ్యాణ తలంబ్రాలు పొందే వెసులు బాటు కల్పించారు. ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
కళ్యాణ వేడక
భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు ప్రతీ ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. కల్యాణ తలంబ్రాలకు విశిష్ఠత ఉంది. ఈ సారి భద్రాచలం శ్రీసీతా రామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రి ల్ 6, 7 తేదీల్లో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేకం ఉత్సవాలకు ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచారు. స్వామి వారి కల్యా ణ తలంబ్రాల తయారీకి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఏడాది 300 క్వింటాళ్లకు పైగా తలంబ్రాలు సిద్ధం చేసి భక్తులకు అందజేయాలనే లక్ష్యలతో దేవస్థానం అధికారులు చేశారు. ఇందులో భాగం గా 25 క్వింటాళ్ల తలంబ్రాలను ముత్తెదువుల సమక్షంలో భక్తులతో కలిసి తయారు చేస్తున్నారు.

భద్రాద్రి ఉత్సవాలు
ఈ నెల 30న శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు భద్రాచలంలో ప్రారంభం కానున్నాయి. కాగా, ఏప్రిల్ 2న ధ్వజపట లేఖనం, 3న గరుడాధివాసం, 4న అగ్నిప్రతిష్ఠ, 5న ఎదుర్కోలు, 6న కల్యాణం, 7న పట్టాభిషేకం, 8న సదస్యం, 12న చక్రతీర్థం ఉత్సవాలు జరుపుతారు. ఇక, మే 22న హనుమజ్జయంతి జరుగనుంది. భద్రాచలం స్వయంగా వెళ్లలేని భక్తులకు స్వామి వారి కల్యాణ తలంబ్రాలు అందించేందుకు తెలంగాణ దేవాదాయ శాఖ - టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు రామయ్య తలం బ్రాలను నేరుగా వారి ఇంటికే చేర్చే కార్యక్ర మానికి శ్రీకారం చుట్టింది. తలంబ్రాల బుకింగ్ విధానం గురించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. బుకింగ్ పోస్టర్ ఆవిష్కరించారు.
హోం డెలివరీ
భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవం పూర్తయిన తర్వాత బుకింగ్ చేసుకున్న భక్తులకు తలంబ్రాలు హోం డెలివరీ చేస్తారు. రాములోరి తలంబ్రాలు కావాలని కోరుకునే భక్తులు టీజీ ఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాలు లేదా సంస్థ వెబ్సైట్ tgsrtclogistics.co.in ఓపెన్ చేసి రూ.151 చెల్లించి మీ పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి. భక్తులు సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లను సంప్రదించిన అయినా నేరుగా ఆర్డర్ చేయవచ్చు. భక్తులు తలంబ్రాల సేవ పొందాలనుకుంటే టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నెంబర్లు 040-69440000, 040-69440069లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications