Telangana: మే 27న సెలవు ఇవ్వండి.. ఎందుకంటే..!
మే 27న సెలవు ఇవ్వాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఆ రోజు వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉందని బీజేపీ పేర్కొంది. పట్టభద్రులు ఓటు వేయాలంటే ఆ రోజు సెలవు ప్రటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ ఎన్నిక కోసం 4.69 లక్షల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు.
వీరంతా ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలని కోరారు. దీనిపై ఎన్నికల సంఘం నేడో, రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పోలింగ్ రోజు దాదాపు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. అయితే పోలింగ్ జరిగే జిల్లాల్లో మాత్రమే హాలిడే ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు తీవ్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇందులో గత ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపిపించుకునేందుకు నాయకులు పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో పాటు మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ లు, అసెంబ్లీ నియోజక వర్గ ఇన్ఛార్జ్ లు, కో-ఆర్డినేటర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. కాగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీదే అయినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ పార్టీకే మొగ్గు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications