వైరల్ వీడియో.. పెళ్ళిపీటలపైనే వందేమాతరం గీతాలాపన చేసిన వధూవరులు!
వందేమాతర గీతాలాపనతో ఈరోజు దేశమంతా ఒక్కసారిగా తమ ప్రగాఢమైన దేశభక్తిని చాటుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన 'వందేమాతరం' గేయానికి ఈరోజుతో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాలను ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. సామూహిక గేయాలాపనలో ప్రధానమంత్రి కూడా పాల్గొని పాడారు.
దేశమంతా సామూహిక వందేమాతర గేయాలాపన
వందేమాతర గీతాలాపన అనంతరం స్మారక స్టాంపును, నాణేన్ని కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. అలాగే, రాష్ట్రమంతా నేడు వందేమాతర గేయాన్ని ఆలపించింది. అన్ని జిల్లాల కలెక్టరేట్లు, అన్ని విద్యామందిరాల్లో సామూహిక వందేమాతర గేయాలాపన కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయోద్యమ మహనీయులకు ఘన నివాళులర్పించారు. వందేమాతరం.. జాతీయ గీతం స్ఫూర్తిగా, సమైక్యతా భావంతో దేశ అభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.

పెళ్లి వేడుకలో వందేమాతరం గీతాలాపన
కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.సామూహిక వందేమాతర గీతాలాపన ప్రజలందరిలోనూ దేశభక్తిని ప్రేరేపించింది. వాడ వాడలా ప్రజలు, విద్యార్థులు, విభిన్న వర్గాలవారు నేడు వందేమాతర గీతాలాపన చేశారు. వరంగల్ నగరంలోని ఒక వివాహ వేడుకలోనూ వందేమాతర గీతాలాపన ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చింది.
పెళ్ళిపీటల పైనే వందేమాతరం గీతాలాపన చేసిన వధూవరులు!#Marriage #VandeMataram #150YearsForVandeMataram #ViralWatch #Warangal #Oneindia #OITelugu pic.twitter.com/lBAqrR1FdI
— oneindiatelugu (@oneindiatelugu) November 7, 2025
పెళ్లి పీటల మీదే వధూవరుల వందేమాతరం గీతాలాపన
వరంగల్ నగరంలోని రంగశాయి పేటకు చెందిన కానిస్టేబుల్ గోగికార్ శ్రీకాంత్, లక్ష్మిసాయి ల వివాహం నేడు జరిగింది. ఈ క్రమంలో వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు వివాహ వేడుకలో సామూహిక వందేమాతర గీతాలాపన చేసి దేశభక్తిని చాటారు. పెళ్లి పీటల పై నుండి లేచిన వధూవరులు జాతీయ జెండా పట్టుకుని వందేమాతరం గానం చేశారు.
వివాహ వేడుకలోనూ దేశభక్తిని నింపిన వందేమాతరం
ప్రతీ ఒక్కరు హక్కులను పొందినట్లే ప్రాథమిక విధులను అదేశిక సూత్రాలను పాటించాలనే ఉద్దేశ్యంతోనే వివాహ వేడుకల్లో వందేమాతరం పాడించామని పెళ్ళిపెద్దలు తెలిపారు. జాతీయ జెండాను చేత పట్టుకున్న వధూవరుల సైతం పెళ్లి పీటల మీదనే వందేమాతర గీతాలాపన చేశారు. వివాహ వేడుకల్లో దేశభక్తితో చేపట్టిన కార్యక్రమం పట్ల పలువురు అధికారులు, ప్రముఖులు అభినందలు తెలిపారు.
-
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications