ఆ బస్సును 37 ముక్కలు చేసారు..! దొంగతనానికే కొత్త అర్థం చెప్పిన కేటుగాళ్లు ..!!
హైదరాబాద్ : అఫ్జల్గంజ్ పరిధిలో కుషాయిగూడ ఆర్టీసీ బస్సు చోరీకి గురైందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా బస్సు చోరీ నిందితులను గుర్తించామని వివరించారు. ఈ సందర్భంగా కేసు వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో వివరించారు. ఇద్దరు అన్నదమ్ములు బస్సు చోరీకి పాల్పడ్డారని, నాందేడ్లో బస్సును ఇతరులకు అప్పగించారని చెప్పారు. బస్సును నాందేడ్కు 10 కిలోమీటర్ల దూరంలోని షెడ్డుకు చేర్చి, నిందితులు బస్సును 37 ముక్కలుగా చేశారని, బస్సును తుక్కుగా చేసి విక్రయించాలనేది నిందుతుల ఆలోచన అని సీపి వివరించారు.
బస్సుకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని సీపి తెలిపారు. అఫ్జల్గంజ్ నుంచి బస్సు ఎత్తుకెళ్లిన నిందితులు ఇద్దరిని గుర్తించామని, వీరిద్దరిపై గతంలో పలు కేసులు ఉన్నాయన్నారు. ఇద్దరు నిందితులు అన్నదమ్ములని, దుబాయ్లో భారీ వాహనాలు నడిపిన అనుభవం వీరికి ఉందని, జల్సాలకు అలవాటు పడి నిందితులు చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. అఫ్జల్గంజ్ పరిధిలో వీరు ఆటోలు నడిపేవారని, బస్సు చోరీ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదు చేశామని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు.

-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications