ZPTC,MPTC ఫలితాలు వాయిదా... క్యాంపు రాజకీయాలు భరించలేం...
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ఆలస్యంగా విడుదల చేయనుంది రాష్ట్ర్ర ఎన్నికల సంఘం. స్థానిక జడ్పీటీసీ,ఎంపీటీసీల పదవికాలం జులై మూడు వరకు ఉండడంతో ఎన్నికల సంఘానికి పలు పిర్యాధులు అందాయి. దీంతో ఈనెల 27న విడుదల చేయాల్సి జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను ఆలస్యంగా విడుదల చేయాలని నిర్ణయించింది.

మరోవైపు ఎన్నికల ఫలితాలను నెలరోజుల ముందు విడుదల చేసినట్లయితే జడ్పీ చైర్మన్తో ఎంపీపీల ఎంపికలో క్యాంప్ రాజకియాలకు అవకాశం ఉందన్న ఆందోళనను పలు పార్టీలు తమ అభిప్రాయం వ్యక్తం చేశాయి.దీంతో ఆయా పార్టీల విజ్ఝప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ ఫలితాలను వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది.
కాగా వాయిదా వేసిన ఎన్నికల ఫలితాలను ఎప్పుడు ప్రకటించేది మరోసారీ నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేయనుంది.ఈనేపథ్యంలోనే ఫలితాలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది.












Click it and Unblock the Notifications