సిబీఐ విచారణకు నిరాకరించిన హైకోర్టు..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ విచారించాలన్న అభ్యర్థను హైకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని.. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలంటూ బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును ఇప్పపటికే సిట్ విచారిస్తుందని.. సిట్ దర్యాప్తును కొనసాగించాలని ఆదేశించింది. నివేదికన సీల్డ్ కవర్ లో హైకోర్టుకు అందించాలని స్పష్టం చేసింది.
ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే నిందితులకు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు చేసింది. కాగా ఈ కేసులో రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజులు నిందితులుగా ఉన్నారు. సోమవారం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితులు వేసిన బెయిల్ పిటిషన్ ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది.నిందితుల బెయిల్ పిటీషన్లపై విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.