తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు ఇవే: ఆ జిల్లాల్లో జల ప్రళయం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వల్ల భారీ వర్షాలు, వరదలు తెలంగాణను ముంచెత్తుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, మంచిర్యాల, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
దక్షిణ తెలంగాణ ప్రాంతాలైన వికారాబాద్, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాలకూ భారీ వర్ష సూచన చేశారు. ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాతావరణ కేంద్రం అంచనాలకు అనుగుణంగా తెలంగాణలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి.

27 ఉదయం 8:30 గంటల నుంచి 28వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు రికార్డయిన అత్యధిక వర్షపాతం వివరాలను భారత వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసింది. కామారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాజంపేట మండలం అర్గొండలో 431.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని అక్కాపూర్లో 323.3, మెదక్ జిల్లా హవేలిఘనపూర్లోని సర్దానాలో 305.3, కామారెడ్డి టౌన్ ఐడీఓసీ వద్ద 289.0, నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని వడ్డ్యాల్లో 279.3, కామారెడ్డి జిల్లా భిక్కనూర్లో 279.0 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది.
మెదక్ జిల్లా హవేలిఘనపూర్లోని నాగపూర్లో 276.5, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 275.8, కామారెడ్డి పాత రాజంపేటలో 247.3, నిర్మల్ జిల్లా విశ్వనాథపేటలో 241, నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని ముజిగిలో 231.5, మెదక్ జిల్లా చేగుంటలో 227.8 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది.
కామారెడ్డి జిల్లా లింగంపేటలో 222.0, మెదక్ జిల్లా రామాయంపేటలో 206.0, మెదక్ ఆర్డీఓ కార్యాలయం వద్ద 205.8, కామారెడ్డి జిల్లా దోమకొండలో 202.0, మెదక్ జిల్లా రాజ్పల్లిలో 193.5, కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలోని లాచాపెట్లో 190.0, కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో 185.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
సిద్దిపేట జిల్లా కొండపాకలో 184.8, కామారెడ్డి జిల్లా పల్వంచలోని ఏలుపుగొండలో 180.8, సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని కొడకండ్లలో 178.8, కుమరం భీమ్ జిల్లా రెబ్బెనలో 177.8, కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 175.3, నిర్మల్ జిల్లా సారంగాపూర్లోని జామిలో 174.3 మిల్లీ మీటర్ల వర్షం పడింది.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 173.5, సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో 173.3, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లోని హసన్పల్లిలో 170.5, నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పక్పట్లలో 170.3, నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో 170.0 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications