పెద్దపులి దాడిలో యువతి మృతి -ఆసిఫాబాద్లో మరో విషాదం -మూడు వారాల్లో రెండో ఘటన
క్రూరమృగాల వరుస దాడులతో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గజగజా వణికిపోతున్నది. కొద్ది రోజుల కిందట ఓ యువకుడు పులికి బలైపోగా, తాజాగా అదే రీతిలో మరో యువతిని పెద్దపులి దాడిలో మృతి చెందింది. ఆదివారం(29 నవంబర్) చోటుచేసుకున్న ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
Recommended Video
ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నిర్మల(17) అనే యువతి తమ వ్యవసాయ బావి వద్ద పత్తి చేనులో పనిలో నిమగ్నమై ఉండగా, ఆమెపై పులి అమాంతంగా దాడి చేసింది. నిర్మలను నోటకరుచుకున్న పులి.. ఆమెను అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లింది. పులి దాడి చేసిన సమయంలో అక్కడే పనిచేస్తున్న ఇతర కూలీలు భయంతో పరుగులు తీశారు.

కాసేపటి తర్వాత, కుటుంబసభ్యులు, కొంత మంది గ్రామస్థులతో కలిసి ఆ పరిసర ప్రాంతాల్లో గాలించగా, నిర్మల మృతదేహాం లభించింది. ఆసిఫాబాద్ జిల్లాలో గత మూడు వారాల వ్యవధిలో ఇది రెండో సంఘటన. నవంబర్ 11న దహెగాం మండలం దిగిడలో పులి దాడిలో గిరిజన యువకుడు సిడాం విఘ్నేశ్ (22) మరణించాడు.
మ్యాన్ ఈటర్ టైగర్ సంచరిస్తోందన్న సమాచారం వెలువడినప్పటి నుంచే దానిని బంధించడానికి అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నా ఫలితం రాలేదు. ఈలోపే ఇద్దరు బలికావడం జిల్లాలో సంచలనంగా మారింది. అయితే.. విఘ్నేశ్ను, నిర్మలను చంపిన పులి ఒకటేనా? వేర్వేరా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications