Times Now-ETG exit polls: తెలంగాణలో ఆ పార్టీకి క్లీన్ మెజారిటీ..!!
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 62 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు సమాచారం. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. తెలంగాణతో పాటు అయిదు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో వివిధ సంస్థలు నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ వివరాలు అందుతున్నాయి.
Recommended Video

తెలంగాణపై టైమ్స్నౌ- ఈటీజీ (Times Now-ETG) నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ (Telangana Exit Polls).. భారత్ రాష్ట్ర సమితి వైపు మొగ్గు చూపాయి. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం.. 60. బీఆర్ఎస్ ఈ మేజిక్ ఫిగర్ను అందుకుంటుందని తేల్చాయి.

టైమ్స్నౌ- ఈటీజీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన సారథ్యంలోని బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది. తెలంగాణలో మరోసారి గులాబీ జెండా ఎగురుతుందని వివరించింది.
బీఆర్ఎస్- 66 స్థానాలను దక్కించుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఈ సారి కూడా నిరాశ తప్పదు. 2018లో కంటే కూడా తన స్థానాలను మాత్రం భారీగా పెంచుకోగలుగుతుంది. 37 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. బీజేపీ ఏడు సీట్లతో సరిపెట్టుకుంటుందని టైమ్స్ నౌ అంచనా వేసింది. ఇక ఇతరులు తొమ్మిది స్థానాలో గెలుస్తారు.












Click it and Unblock the Notifications