పక్క రాష్ట్రం సహకరించుకున్నా...: తుమ్మల
పత్తి రైతులకు మేలైన ధరలు అందిస్తున్నమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రైతులకు 9గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నమన్నారు. గరువారం ఈ విషయమై తుమ్మల మీడియాతో మాట్లాడుతూ మిషన్ కాకతీయ ద్వారా 46వేల చెరువులను పునరుద్దరించి సాగునీరు అందిస్తున్నమని వెల్లడించారు. కేంద్రం, పక్క రాష్ట్రం సహకరించకున్నా ఉమ్మడి రాష్ట్రం కంటే భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. టీ ఐపాస్ తో 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తూ ప్రొడక్షన్ లో కూడా తెలంగాణ ముందుందని స్పష్టం చేశారు. ప్రజల బాధలు తెలిసిన సీఎం ఉండటం మన అదృష్టమన్నారు.












Click it and Unblock the Notifications