సంచలన వ్యాఖ్యలు చేసిన రవిప్రకాశ్ ... ఇది మీడియాకు .. మాఫియాకు మధ్య యుద్ధం
ఎట్టకేలకు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పోలీసుల విచారణకు హాజరయ్యాడు..మంగళవారం సాయంత్రం సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరైన రవిప్రకాష్ ను ఏసీపీ శ్రీనివాసరావు సుమారు ఐదు గంటల పాటు విచారించారు. అయితే బుధవారం కూడా మరోసారి రవి ప్రకాష్ ను విచారణ చేయనున్నారు.. విచారణ అనంతరం బయటకు వచ్చిన రవిప్రకాష్ మీడియాతో మాట్లాడారు..

అక్రమ కేసులంటూ ఆరోపించిన రవి ప్రకాశ్
ఈ నేపథ్యంలోనే తనపై అక్రమంగా కేసులు పెట్టిన వారిపై ఫైర్ అయ్యాడు. హైదరాబాద్కు చెందిన ఇద్దరు ధనిక వ్యాపారవేత్తలు తనని మోసగించారని అన్నారు. అనంతరం టీవీ9 ని స్వాధీనం చేసుకునేందుకు కేసులు పెట్టిన దొంగ దారిన అనేక కుట్రలు చేశారని
ఆరోపించాడు. ఇదే విషయాలను పోలీసులకు వివరించానని చెప్పాడు.వారి అక్రమాలు బయటకు రాకుండా నా పై మూడు కుట్ర కేసులు పెట్టారని అన్నారు. ఇంతకు మందే ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే మీడీయాకు వివరించానని అన్నాడు. కాగా అవన్నీ దొంగ కేసులు, కుట్ర కేసులని చెప్పాడు..

ధనికస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడతా...
దీంతో తాను వ్యక్తిగతంగా ధనిక స్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారని అన్నాడు. బిల్డర్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియాతోపాటు కాంట్రాక్టు మాఫీయాకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నట్టు తెలిపాడు. అక్రమ కేసులు బనాయించినవారు అవి బయటకు రాకుండా మీడియాను కూడ మేనేజ్ చేస్తున్నారని అన్నారు. మొత్తం ఇది సత్యానికి, అసత్యానికి, మాడీయాకు మాఫియాకు మధ్య జరుగుతున్న పోరాటమని పేర్కోన్నారు. ఈ పోరాటంలో చివరకు సత్యం గెలుస్తుందని,మీడీయా విజయం సాధిస్తుందని అన్నారు.
మరోవైపు తాను ప్రస్థుతం ఒంటరిగా పోరాటం చేస్తున్నానని అయినా పోలీసులు తనకు సహకరిస్తున్నారని అన్నారు. పోలీసులు కూడ అక్రమ కేసులపై అందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇలాంటీ అక్రమాలు జరగకుండా తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు.

ముందస్తు బెయిల్ను తిరస్కరించిన కోర్టులు,
ఫోర్జరీ, డేటా చౌర్యం కేసుల్లో నిందితుడిగా ఉన్న రవిప్రకాశ్ గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి రవిప్రకాశ్ తీవ్రంగా ప్రయత్నించారు. అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు
మేరకు పోలీసులు రవిప్రకాశ్పై ఫొర్జరీ కేసు నమోదు చేశారు. అయితే ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు తిరస్కరించాయి. . దీంతో ఆయన మంగళవారం సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications