హైదరాబాద్ పాతబస్తీలో కూలిన భవనం: ఇద్దరు మృతి
హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని పురానాపూల్ హుస్సేనిఅలం కబూతర్ ఖానా దగ్గర నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన స్థానిక ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నందూ, వెంకటయ్యలుగా గుర్తించారు. భవనం కూలిన ఘటనపై పోలీసులు, కార్మికశాఖ విచారణ చేపట్టారు. భవనం కూలిన ఘటనపై హుస్సేనీ ఆలం పోలీసులు కేసు నమోదు చేశారు.

భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధితుల వివరాలును కార్మికశాఖ సిబ్బంది తెలుసుకుంటున్నారు.
బాధితులకు న్యాయం చేస్తామని కార్మికశాఖ అధికారులు హామి ఇచ్చారు. భవన యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కూలీలు మృతి చెందారని బాధితుల బంధువులు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని బంధువులు ఆందోళనకు దిగారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications