రాజ్భవన్లో ఉగాది సందడి : ఆటపాటలతో హోరెత్తించిన కళాకారులు
హైదరాబాద్ : తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు రాజ్భవన్లో ఒకరోజు ముందే నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు గవర్నర్. ఆ తర్వాత నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఆట పాట
తొలుత ప్రముఖ నేపథ్యగాయని మాళవిక గానమృతంతో కార్యక్రమం ప్రారంభమైంది. తర్వాత వైష్ణవి, విఘ్నేశ్ బృందం డ్యాన్సులతో అలరించారు. ప్రీ ఉగాది వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కళాకారులు ప్రదర్శించిన గుస్సాడి నృత్యం ఆకట్టుకొంది.
పంచాగ శ్రవణం, గవర్న్ విషెస్
వికారినామ ఉగాది సంవత్సరం తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితుడు శ్రీ విద్య శ్రీధర శర్మ పంచాగ శ్రవణం చేసి తెలిపారు. ఈ ఉగాది ప్రజల శాంతి, సౌభ్రాతుత్వంతో మెలగాలని, వారికి సంతోషం కలిగించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. ఆ తర్వాత వివిధ కళారూపాలు ప్రదర్శించిన కళాకారులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తాత్కాలిక సీజేఐ రాఘవేంద్ర చౌహన్, ఏపీ తాత్కాలిక సీజే ప్రవీణ్ కుమార్, తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications