రేవంత్ రెడ్డి బైమిస్టేక్లో సీఎం అయ్యారు! ఇంత అహంకారమా?: కిషన్ రెడ్డి ఫైర్
ఎన్నికల్లో ఓటమి భయంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలో అసహనం బాగా పెరిగిపోయిందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతున్నాయని దుయ్యబట్టారు.
ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా, రిజర్వేషన్లపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెప్పినా.. ఆ రెండు పార్టీలు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రచారానికి ఊరూరా అద్బుతమైన స్పందన వస్తోందన్నారు.

తమ పార్టీపై ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు తమనే ఆదరిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తున్నారన్నారని చెప్పుకొచ్చారు. రిజర్వేషన్ లబ్దిదారులే బీజేపీపై విశ్వాసంతో మద్దతు పలుకుతున్నారని చెప్పారు.
బైమిస్టేక్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన పార్టీ గుర్తు గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు. గాడిద గుడ్డు పెట్టదని.. కానీ, రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు పెట్టించారని చురకలంటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీపై రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు బీజేపీ గెలవబోతుందన్నారు కిషన్ రెడ్డి. విపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారం తమకు సానుకూలంగా మారుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో అసహనం కనిపిస్తోందన్నారు. ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులను జైల్లో వేస్తే బుద్ది వస్తుందన్న రేవంత్ రెడ్డి.. ప్రకటనలు ఆయన అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!











Click it and Unblock the Notifications